Don't Miss!
- News కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్తో చర్చ!!
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Sports RCB vs KKR: దాన్ని నైట్ రైడర్స్ బ్రేక్ చేయగలదా?
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అంతా యూట్యూబ్ పుణ్యమే.. జబర్దస్త్ అవినాష్, విష్ణుప్రియలతో సందడి.. శ్రీముఖి సెలెబ్రేషన్స్
బుల్లితెర రాములమ్మ, బిగ్బాస్ మూడో సీజన్ రన్నర్ శ్రీ ముఖి గురించి రెండు తెలుగు రాష్ట్రాలకు తెలిసిందే. వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన శ్రీ ముఖి పటాస్ షోతో ఓ రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంది. రాములమ్మ సిగ్నేచర్ స్టెప్స్తో యూత్ను తెగ ఆకట్టుకుంది. బిగ్బాస్ షో ద్వారా శ్రీ ముఖి మరింత అభిమాన గణాన్ని సొంతం చేసుకుంది. అయితే శ్రీముఖికి అంతకు ముందు ఉన్న క్రేజ్ కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. బిగ్బాస్ తరువాత ఆమె చేసే షోలో ఎలాంటి వల్టారిటీకీ చోటు లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ లాంటివి చేస్తూ వస్తోంది. గతంలో మాదిరి అడల్ట్ పంచ్లు, స్కిట్స్ ఉండేటు వంటివాటి జోలికి వెళ్లడం లేదు.
లౌడ్ స్పీకర్ ట్యాగ్తో..
బిగ్ బాస్ హౌస్లో శ్రీముఖిని లౌడ్ స్పీకర్ అని సంబోధించేవారు. ఆమె మాట్లాడితే తన ఇంటి వరకు కూడా వినిపిస్తోందని హోస్ట్గా వ్యవహరించిన నాగార్జున కూడా సెటైర్స్ వేసేవాడు. ఆమె మాట్లాడే విధానం, గొంతెత్తే విధానంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ నడిచేవి.
స్ట్రాటజీలతో గేమ్..
మూడో సీజన్ మొదలైనప్పటి నుంచి శ్రీ ముఖియే విన్నర్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఓ దశ దాటాక బాబా భాస్కర్ చెప్పిన లాజిక్ను అర్థం చేసుకుని రాహుల్తో గొడవ పెట్టుకోకుండా ఉంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అలా విన్నర్గా నిలవాల్సిన శ్రీ ముఖి.. రన్నర్గా మిగిలిపోయింది.
దోస్తులతో హల్చల్..
బిగ్బాస్ షో అనంతరం శ్రీ ముఖి తన దోస్తులతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. ఆర్జే చైతు, శ్రీముఖి తమ్ముడు శుశ్రుత్, విష్ణు ప్రియ ఇలా అందరూ కలిసి మాల్దీవుల్లో ఓ వారం పాటు ఎంజాయ్ చేసి వచ్చారు. వీరంతా నిత్యం కలుస్తూ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. వీరిలో జబర్దస్త్ అవినాష్ సైతం అప్పుడప్పుడూ సందడి చేస్తుంటాడు.
అంతా యూట్యూబ్ పుణ్యమేనంటా..
లాక్డౌన్ అందరూ ఏదో ఒక కొత్త పనిని నేర్చుకుంటూ ఖాళీగా దొరికిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే శ్రీ ముఖి వెరైటీ వంటకాలను నేర్చుకుందట. యూట్యూబ్లో చూసి చికెన్తో రకరకాల వంటలను వండటం నేర్చుకుందట.
రంజాన్ సెలెబ్రేషన్స్లో..
రంజాన్ సెలెబ్రేషన్స్లో భాగంగా తన గ్యాంగ్ను ఇంటికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్జే చైతూ, విష్ణు ప్రియ, జబర్దస్త్ అవినాష్, ఇంకా కొందరు స్నేహితులు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక తన పాక శాస్త్ర నైపుణ్యాన్ని అందరికి రుచి చూపించినట్టు తెలుస్తోంది. అన్ని వంటలు తానే చేశానని, అది కూడా యూట్యూబ్ సాయంతో అని చెప్పుకొచ్చింది.