Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఫైనల్స్లో... శ్రీదేవి-మాధురి దీక్షిత్!
ఇప్పటికే ఝలక్ ధిక్లా జా-5 కార్యక్రమానికి మాధురి దీక్షిత్, కరణ్ జోహార్, రెమో డిసాజలు జడ్జిలుగా కొనసాగుతూ వస్తున్నారు. గ్రాండ్ ఫైనల్ల్లో శ్రీదేవి ఈ షోలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. ఈ నెల 30న కలర్స్ ఛానల్లో ఝలక్ ధిక్లా జా-5 గ్రాండ్ ఫైనల్ జరుగనుంది.
శ్రీదేవి నటించిన 'ఇంగ్లీష్-వింగ్లిష్' మూవీ అక్టోబర్ 5న విడుదలవుతున్న నేపథ్యంలో.... శ్రీదేవిని ఈ షోలో గెస్ట్ అప్పియరెన్స్ ఇప్పించడం ద్వారా సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కుతుందని ఆశిస్తున్నారు. అమెరికాలో ఒక భారతీయ గృహిణి ఇంగ్లీష్ మాట్లాడేందుకు ఇబ్బందులు పడుతూ ఎదుర్కొన్న అవమానాలు, ఆ తర్వాత ఆమె ఏం చేసింది అనే ఇతి వృత్తంతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు.
గతంలో మాధురి దీక్షిత్ చాలా గ్యాప్ తర్వాత 'ఆజా నచ్ లే' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వగా....ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. దీంతో మాధురి దీక్షిత్ బుల్లితెర కార్యక్రమాల వైపు మళ్లింది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ను పెళ్లి చేసుకున్న తర్వాత హౌస్ వైఫ్ గా సెటిలైన శ్రీదేవి ఇంతకాలం తన ఇద్దరు కూతుర్ల బాగోగులు చూసుకుంటూ గడిపేసింది. మరి శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ ఏమేరకు సక్సెస్ అవుతుందో..