Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
షాకింగ్: ‘మాటీవీ’ డీల్ విలువ అంతా?
హైదరాబాద్: తెలుగులో అనతి కాలంలోనే పాపులర్ అయిన ‘మా టీవీ' దినదినాభివృద్ధి చెందుతూ తెలుగులో నెం.1 ఎంటర్టెన్మెంట్ నెట్వర్క్గా విస్తరించింది. మాటీవీ నెట్వర్కులో దాదాపు అరడజనుకుపైగా ఛానల్స్ ఉన్నాయి. తాజాగా మాటీవీని స్టార్ ఇండియా నెట్వర్క్ వారు సొంతం చేసుకున్నారు.
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన డీల్ లో స్టార్ గ్రూప్ యాజమాన్యం మా టీవీలోని వాటాను కొనుగోలు చేసింది. అయితే మార్కెట్ రేట్ ప్రకారం ఎంత మొత్తం వెచ్చించారనేది విలేకరులు ప్రశ్నించగా మీడియా సమావేశంలో ఎవరూ స్పదించలేదు. అనధికారిక సమాచారం ప్రకరాం దీని విలువ రూ. 2500 కోట్లు ఉంటుందని అంచనా.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
మాటీవీ రాకముందే తెలుగులో సన్ నెట్వర్క్ కు సంబంధించిన జెమినీ టీవీ అధిపత్యం కొనసాగేది. అయితే మాటీవీ రాకతో సీన్ మారింది. నెం.1 స్థానంలో మాటీవీ కొనసాగుతోంది. మా టీవీలో నిమ్మగడ్డ ప్రసాద్ కు 60శాతం వాటా, నాగార్జున, చిరంజీవిలకు 20శాతం వాటా చొప్పున ఉన్నాయి. ఈ డీల్ ద్వారా వీరికి భారీగా లాభాలు వచ్చాయని తెలుస్తోంది.
ఎవరెవరికి ఎంతెంత వాటాలు, ఎవరి భాగం ఎంత విషయం ఇంకా బహిరంగపరచకపోయినప్పటికీ...ప్రపంచంలోనే అతి పెద్ద శాటిలైట్ ఛానెళ్ల గ్రూప్ అయినటువంటి స్టార్ నెట్ వర్క్ తో మాటీవి భాగస్వామ్యం కుదుర్చుకోవటం తెలుగు టీవి ఛానెళ్ పరిణాల్లో చాలా కీలకమైనదిగా చెప్పుకోవాలి.