Don't Miss!
- News నీ భార్యతో ఎంజాయ్ చెయ్యాలని ఉంది, ఫ్రెండ్స్ పార్టీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి భర్తకు ఆఫర్ !
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
- Finance Patanjali: బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణకు సుప్రీంకోర్టు షాక్.. షేర్ల పతనం..!
- Sports IPL 2024: మాటిస్తున్నా..జరిగేది అదే- గంభీర్
- Technology Samsung నుంచి గెలాక్సీ అల్ట్రా డేస్ సేల్! ఆఫర్ల వివరాలు
- Automobiles Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
సుశాంత్ సింగ్, అంకితా లోఖండే రొమాంటిక్ వీడియో వైరల్.. ఎన్నో మధురానుభూతులతో...
దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆకస్మిక మరణం ఎందరినో విషాదంలో ముంచెత్తింది. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆయన మృతిని ఇప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొన్నది. జూన్ 14వ తేదీన ముంబైలోని బాంద్రాలో ఉన్న తన నివాసంలో సుశాంత్ ఉరివేసుకొని మరణించారనే వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆయన మరణించి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో సుశాంత్, ఆయన మాజీ ప్రేయసి అంకితా లోఖండేకు సంబంధించిన ఓ వీడియో మీడియాలో వైరల్గా మారింది.
సుశాంత్ సింగ్, అంకిత ఇద్దరు కలిసి పవిత్ర రిస్తా అనే హిందీ టెలివిజన్ సీరియల్లో నటించారు. ఈ టెలివిజన్ సీరియల్తో విశేషంగా అభిమానులను సొంతం చేసుకొన్నారు. ఈ సీరియల్ జూర్ 1 తేదీకి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో నిర్మాత ఏక్తా కపూర్ ఓ వీడియోను షేర్ చేశారు. ఆ సీరియల్లో మానవ్ (సుశాంత్), అర్చన (అంకిత) వివాహం తర్వాత వచ్చే రొమాంటిక్ పాట ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ను తలుచుకొని అభిమానులు మరోసారి భావోద్వేగానికి గురయ్యారు.
ఈ వీడియోలో వచ్చే జైసీ హో వైసీ రహో అనే పాట ఇప్పుడు అందర్నీ ఆకట్టుకొంటున్నది. ఈ పాటను సింగర్ యాసర్ దేశాయ్ పాడారు. వినయ్ రామ్ తివారీ సంగీతం అందించారు.
పవిత్ర రిస్తా సీరియల్ 12 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా 12 సంవత్సరాలు .. లక్షలాది మెమొరీస్ మదిలో మెదిలాయి. పవిత్ర రిస్తా నా కెరీర్ను ఉన్నత స్థితికి చేర్చింది. జీవితాంతం బాండింగ్ను ఏర్పరిచింది అంటూ ఏక్తా కపూర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తన వీడియోను కూడా షేర్ చేశారు.