Don't Miss!
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బిగ్ బాస్ వివాదం: మరో అడుగు ముందుకేసిన గాయత్రి గుప్తా, శ్వేతా రెడ్డి.. ఈ సారి ఏకంగా!
భారీ పాపులారిటీ ఉన్న బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. మరో నాలుగైదు రోజుల్లోనే ప్రారంభం కానున్న ఈ షోపై వివాదాలు రాజుకుంటున్నాయి. బిగ్ బాస్ పేరిట బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నారా? అంటూ శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా లాంటి వారు బహిరంగ ఆరోపణలు చేయడంతో ఈ ఇష్యుపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే ఆ ఇద్దరూ తాజాగా కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
‘బిగ్ బాస్' షో ముసుగులో బ్లూ ఫిల్స్మ్ చేసుకోండి
బిగ్ బాస్ అనే రియాలిటీ షో మాటున ఆ షో నిర్వాహకులు మహిళలను మోసం చేస్తున్నారని శ్వేతా రెడ్డి చెబుతోంది. ఈ మేరకు బిగ్ బాస్పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆమె.. ''శ్రీరెడ్డిని చెత్త చెత్త ప్రశ్నలు అడిగారు. గాయత్రి గుప్తాని అడగకూడనివి అడిగారు. అందుకే నేను అంటున్నా.. మీరు ‘బిగ్ బాస్' షో ముసుగులో అవేవో చేసే బదులు.. బ్లూ ఫిల్స్మ్ చేసుకుని డబ్బులు సంపాదించుకోండి. ఎక్కువ రేటింగులతో పాటు డబ్బులు కూడా ఎక్కువే వస్తాయి'' అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయింది.
గాయత్రీ గుప్తా ఆవేదన
బిగ్బాస్ షోకి వచ్చేందుకు తనను కమిట్మెంట్ అడిగారని, అది కాదన్నందుకు గాను తనను ఎంపిక చేయలేదని గాయత్రి గుప్తా ఆరోపిస్తోంది. తనను వంద రోజుల పాటు హౌస్లోనే ఉండాలి కాబట్టి వేరే ప్రాజెక్టులేవీ ఒప్పుకోవద్దని చెప్పారన్నారు. తాను ఆరు నెలలుగా సినిమాల్లో నటించే అవకాశాన్ని కోల్పోయానని గాయత్రి గుప్తా ఆవేదన చెందింది.
బిగ్ బాస్ పై పోలీస్ కేసు
ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకుల వాలకంపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాను సైన్ చేసిన డాక్యూమెంట్స్ వెంటనే తిరిగి ఇచ్చేయాలని, అదేవిధంగా బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా తాజాగా మరో అడుగు ముందుకేసి ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు ఆ ఇద్దరూ.
బెయిల్ మంజూరు చేయొద్దు.. షో ప్రారంభం కష్టమే!
బిగ్ బాస్ వివాదంలో నిందితులుగా ఎఫ్ఐఆర్లో నమోదైన రవికాంత్, రఘు, అభిషేక్, శ్యాం లకు ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దంటూ హైకోర్టును విన్నవించారు గాయత్రి గుప్తా, శ్వేతారెడ్డి. దీంతో బిగ్ బాస్ వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తాజా పరిణామాలు చూస్తుంటే జులై 21 న బిగ్ బాస్ ప్రారంభం కానుండటం సందేహమే అనిపిస్తోంది.