Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
అనుమానాలకు తావిస్తోన్న తమన్నా, జాఫర్ వ్యాఖ్యలు.. ‘బిగ్ బాస్’లో నిజంగా అదే జరుగుతోందా.!
తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన షోలలో 'బిగ్ బాస్' రియాలిటీ షో ఒకటి. కొందరు సెలెబ్రిటీలను ఓ ఇంట్లోకి పంపించడం.. హౌస్మేట్స్తో కలిసి కొన్ని రోజులు ట్రావెల్ చేయడం.. కుట్రలు కుతంత్రాలు తట్టుకుని నిలబడడం.. చివరకు ఇంట్లోని వారితో పాటు ప్రేక్షకుల హృదయాలను గెలిచిన ఒకరిని విజేతగా ప్రకటించడం.. ఇదీ బిగ్ బాస్ ప్రాసెస్. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం మూడో సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ షోపై అనుమానాలు వస్తున్నాయి. కారణం.. వారిద్దరూ చేసిన వ్యాఖ్యలే.
రియాలిటీ షోనా? కాదా?
ఇండియాలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో అని పదే పదే చెప్పే ‘బిగ్ బాస్' నిజంగానే స్క్రిప్ట్ లేకుండా ఉంటుందా..? అన్న అనుమానాలు అందరికీ కలిగాయి. అయితే, కత్తి మహేశ్, బాబూ గోగినేని వంటి వారు వెళ్లడంతో ఇది నిజమైన రియాలిటీ షోనే అన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తం అయింది. ఇప్పటికీ ఈ షో గురించి చాలా మంది నమ్మడం లేదు.
తమన్నా వ్యాఖ్యలతో అనుమానం
ఆదివారం బిగ్ బాస్ నుంచి తమన్నా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆమె స్టేజ్ మీదకు వచ్చిన వెంటనే షో గురించి చెప్పడం ప్రారంభించింది. ‘నేను బిగ్ బాస్ షోను స్క్రిప్టెడ్ అనుకున్నాను. మొన్నటి వరకు నాకు ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. కానీ, లోపలికి వెళ్లిన తర్వాత ఈ షో గురించి పూర్తిగా తెలిసింది. ఇది స్క్రిప్టెడ్ కాదు' అని చెప్పుకొచ్చింది.
అనసూయ చేతిపై ఉన్న పేరుకు అర్థం ఇదే.. నిజంగా నమ్మలేరు.!
మొన్న జాఫర్ కూడా..
గత వారం జాఫర్ కూడా ఇదే తరహా వివరణ ఇచ్చాడు. తాను ఈ షోలోకి వచ్చినప్పుడు ఇదంతా స్క్రిప్ట్ అని అనుకున్నాని చెప్పారు. ఇంట్లోకి వెళ్లిన రెండు రోజుల వరకు తన మనసులో ఇదే ఆలోచన ఉందన్నారు. కానీ, ఇప్పుడు అదంతా తప్పని తనకు తెలిసిందన్నారు. హౌజ్లో ఉన్న వారంతా చాలా నిజాయతీగా ఆడుతున్నారని చెప్పారు.
అవసరం లేకున్నా ఎందుకు?
తమన్నా సింహాద్రి గానీ, జాఫర్ గానీ అవసరం లేకున్నా షో గురించి చెప్పడం ఎందుకు..? వీళ్లు స్క్రిప్టెడ్ కాదు కాదు అని పదే పదే చెప్పడం వల్ల బిగ్ బాస్ రియాలిటీ షో కాదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాఫర్ ఒక్కడే చెప్పుంటే ఆయన జర్నలిస్టు కాబట్టి దీనిపై విశ్వసనీయత ఉండేది. ఇప్పుడు తమన్నా కూడా రిపీట్ చేయడంతో అనుమానాలు రెట్టింపు అయ్యాయి.
వాళ్లే చెప్పించారా..?
ఇదే విషయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. జాఫర్ చెబితే చాలా మంది నమ్మే అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతో షో నిర్వహకులే ఆయనతో అలా చెప్పించారా అన్న సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో తమన్నాతోనూ చెప్పించి ఉంటారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ జాఫర్, తమన్నా వ్యాఖ్యల వల్ల అనుమానాలకు బలం చేకూరినట్లైంది.