Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హౌస్లోకి ఎంటరైన తమన్నా.. ఫస్ట్ డైలాగ్తోనే షాకిచ్చింది.. అవాక్కైన కంటెస్టెంట్స్
Recommended Video
'బిగ్ బాస్' సీజన్ - 3 మొదలైన వారం రోజులకే చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తొలి ఎపిసోడ్ నుంచే కంటెస్టెంట్లు ఏడుపులు, గొడవలు, తిట్టుకోవడాలు చేస్తుండడంతో ఈ షో అప్పుడే చర్చనీయాంశం అయింది. ఇక, మొదటి ఎలిమినేషన్లోనైతే ఎటువంటి ట్విస్టులు కనిపించలేదు. మొదటి నుంచి అనుకున్నట్లు సీనియర్ నటి హేమ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాతే 'బిగ్ బాస్' భారీ ట్విస్ట్ ఇచ్చాడు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీ
వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఇది ‘బిగ్ బాస్' ప్రేక్షకులకు కొత్త కాకపోయినా.. మొదటి ఎలిమినేషన్ అయిపోయిన రోజే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒకరిని లోపలికి పంపించడం షాకింగ్గా అనిపించింది. అంతకు మించిన ట్విస్ట్ అంటే వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి ఎంటరైంది తెలుగు రాష్ట్రాల్లోని అందరికీ సుపరిచితురాలైన ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి కావడం విశేషం.
కాన్ఫిడెంట్గా చెప్పి..
స్టేజ్పై తమన్నా మాట్లాడుతూ.. తన కల నెరవేరిందని చెప్పారు. ట్రాన్స్జెండర్ను అయిన తనకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. తానేంటో నిరూపించుకుంటానని.. హౌజ్లో చివరి వరకు ఉంటానని అన్నారు. బయటికి వచ్చాక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తన కుటుంబం చేసుకుంటానని కాన్ఫిడెంట్గా చెప్పారు.
సీక్రెట్గా ఉంచుతారనుకున్నారు
ఆదివారం ఎపిసోడ్ ఎండింగ్లో తమన్నా వైల్డ్ కార్డ్ ద్వారా వస్తున్నట్లు హోస్ట్ అక్కినేని నాగార్జున చెప్పాడు. అయితే, ఆమె హౌస్ లోనికి ఎప్పుడు వెళ్లాలి అనేది మాత్రం ‘బిగ్ బాస్' నిర్ణయిస్తాడని వెల్లడించాడు. దీంతో తమన్నాను రెండు మూడు రోజుల సీక్రెట్గా ఉంచి, ఆ తర్వాత లోపలికి పంపుతారేమో అనుకున్నారు.
సోమవారమే ఎంట్రీ
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తమన్నాను సోమవారమే హౌస్ లోపలికి పంపించారు. ఈ మేరకు స్టార్ మా యాజమాన్యం ఓ ప్రోమోను కూడా విడుదల చేసింది. ఇందులో తమన్నా మెయిన్ డోర్ ద్వారా లోపలికి ప్రవేశించింది. ఆ సమయంలో ఆమెను చూసిన మిగిలిన కంటెస్టెంట్లు అవాక్కైపోవడం స్పష్టంగా కనిపించింది.
‘పిక్చర్ ఔర్ బాకీ హై దోస్త్'
డోర్ దగ్గర నుంచి తమన్నాను శ్రీముఖి, రోహిణి లోపలికి తీసుకు వెళ్లారు. తమన్నా లగేజ్ను శ్రీముఖి తీసుకెళ్లడం కనిపించింది. ‘పిక్చర్ ఔర్ బాకీ హై దోస్త్' అని ఆమె చెప్పిన డైలాగ్తో ఈ ప్రోమో ఎండ్ అయింది. ప్రస్తుతం హౌస్లో 15 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో ఏడుగురు మగాళ్లు, ఏడుగురు ఆడవాళ్లు, ఒక ట్రాన్స్జెండర్ కావడం విశేషం.