Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మాటీవీ స్పందించడం లేదు : తమ్మారెడ్డి భరద్వాజ
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... ఈటీవీ వెంటనే స్పందించి అనువాదాలను ఆపివేసిందన్నారు. జీటీవీ, జెమినీ టీవీ స్పందించాయన్నారు. హోలీ ఆడటం తెలుగువారి సంప్రదాయం కాదని, అనువాద ధారావాహికలను చూసి మనవాళ్లు సైతం హోలీ జరుపుకుంటున్నారన్నారు.
ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మన పండుగలు అన్ని కలగూరగంపలాగా కలగాపులగం అవుతాయని పేర్కొన్నారు. మన సంసృతి, సంప్రదాయాలు అన్ని మంటగలిసిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సంపన్నులైన ఉత్తరాది అత్తలు కోడళ్లకు పరీక్షలు పెడుతుంటారని నేడు మన దగ్గర అదే ధోరణి ప్రబలుతోందని అన్నారు.
శ్రీకాంత్ ప్రొడక్షన్స్ అధినేత శ్రీనివాస్ మాట్లాడుతూ సమస్యను సాగదీయకుండా టీవీ చానళ్ల యజమాన్యాలు స్పందించాలని కోరారు. సీనియర్ డైరెక్టర్ అశోక్, కళాకారులు ప్రసన్న, వైభవ్, మాణిక్ప్రభు తదితరులు పాల్గొన్నారు. బిందు, నాగబాబు, బృంద, రాజశేఖర్, భార్గవరావు, శశాంక్, విజయ్యాదవ్, కిశోర్, శివరాం, కృష్ణచైతన్య తదితరులు దీక్షలు చేసినవారిలో ఉన్నారు.