Don't Miss!
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
ముదిరిన 'బిగ్ బాస్ 3' వివాదం.. ఇదీ హైకోర్టు రియాక్షన్
Recommended Video
బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ 3' వివాదం సంచలనాలకు దారి తీసింది. గత రెండు సీజన్లపై కొన్ని ఎలిగేషన్స్ వచ్చినప్పటికీ మూడో సీజన్ విషయానికొస్తే వివాదాల సుడిగుండాలు చుట్టుకున్నాయి. షో ప్రారంభానికి ముందు నుంచే బిగ్ బాస్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. తమకు అన్యాయం జరిగిందని, బిగ్ బాస్ పేరిట బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నారని, అమ్మాయిలను మోసం చేస్తున్నారని శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా లాంటి వాళ్ళు పోలీస్ కేసుల వరకూ వెళ్లారు. ఆ తర్వాత కోర్టుకు కూడా ఆశ్రయించి ఫిర్యాదు నమోదు చేశారు. కాగా తాజాగా ఈ ఇష్యుపై హైకోర్టు రియాక్ట్ అయింది. వివరాల్లోకి పోతే..
వివాదంలో బిగ్ బాస్ 3.. శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా ఆరోపణలు
బిగ్ బాస్ నిర్వాహకులు అవకాశం పేరిట అమ్మాయిలకు వల వేస్తున్నారని శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తాలు బహిరంగ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వాళ్ళు బంజారా హిల్స్, రాయదుర్గం పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదు చేయడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగక, తమకు న్యాయం చేయాలంటూ వారు తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించడంతో ఈ వివాదం మరింత పెద్దదైంది.
బిగ్ బాస్ నిర్వాహకుల క్వాష్ పిటిషన్
మరోవైపు శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా సహా ఇంకొంతమంది తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ బిగ్ బాస్ నిర్వాహకులు అదే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇరు వర్గాల వాదనలను పరిశీలనలో పెట్టిన హైకోర్టు నిన్న (బుధవారం) బిగ్ బాస్ నిర్వాహకులకు కాస్త ఊరటనిచ్చింది.
పోలీసులకు ఆదేశాలు జారీ
బిగ్ బాస్ వివాదం విషయమై విచారణ చేపట్టిన తెలంగాణ హై కోర్టు నిర్వాహకులపై నమోదైన కేసులకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులు, పిటిషనర్ను ఆదేశించింది. ఈ నెల 24న తదుపరి విచారణ చేపట్టనున్నామని, తదుపరి విచారణ పూర్తయ్యే వరకు బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయరాదంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.
బ్యాన్ చేయాలంటూ మిన్నంటుతున్న ఆదోళనలు
ఆడవాళ్లను కించపరిచే విధంగా ఉన్న ‘బిగ్ బాస్' షోను వెంటనే రద్దు చేయాలని, నాగార్జున కూడా వెంటనే ఈ షో నుంచి తప్పుకోవాలని ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నాగార్జున ఇంటి ముందు ధర్నాకు దిగారు. పోలీసుల జోక్యంతో విద్యార్థులు వెనుదిరిగారు. ఈ పరిస్థితుల నడుమ జులై 21న బిగ్ బాస్ సీజన్ 3 ఎలా స్టార్ట్ అవుతోందో చూడాలి మరి.