Don't Miss!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నటి నిషాపై గృహ హింస.. శారీరక దాడులు... భార్య ఫిర్యాదుతో టీవీ నటుడు అరెస్ట్
గృహ హింసకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై టెలివిజన్ నటుడు కరణ్ మెహ్రాను గోరెగావ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య నిషా రావల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. గత కొద్దికాలంగా వారిద్దరి మధ్య వ్యక్తిగత అభిప్రాయాలు చోటు చేసుకొన్నాయనే వార్తల మధ్య నిషా ఫిర్యాదు చేయడం టెలివిజన్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ అరెస్ట్ వెనుక కారణాల్లోకి వెళ్లితే...
టెలివిజన్ రంగంలో టాప్ స్టార్లుగా
కరణ్ మెహ్రా, నిషా రావల్ విషయానికి వస్తే.. యే రిస్తా క్యా కహ్లాతా హై సీరియల్లో నైతిక్ సింఘానియా పాత్ర ద్వారా మంచి పాపులారిటి సంపాదించుకొన్నారు. ఇక నేహా రావల్ షాదీ ముబారక్ సీరియల్ ద్వారా విశేషంగా ప్రేక్షకుల నుంచి ఆదరణను కూడగట్టుకొన్నారు.
2012లో ప్రేమ వివాహం
టెలివిజన్ సీరియల్స్ నటించే క్రమంలో కరణ్, నిషా ప్రేమలో పడ్డారు. 2012లో వారిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. వారికి ప్రస్తుతం కావిష్ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. గత నవంబర్లో ఆనందోత్సవాల మధ్య తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొన్నారు. అంతా సవ్యంగా సాగుతున్నదనే అందరూ అనుకొంటున్న సమయంలో వారిద్దరి మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి.
గొడవలు తారస్థాయికి చేరుకోవడంతో
గత కొద్దికాలంగా కరణ్, నిషా మధ్య వ్యక్తిగత అభిప్రాయ బేధాలు చోటుచేసుకొన్నాయి. ఆ క్రమంలోనే వారిద్దరూ గొడవ పడుతున్నారు. ఇటీవల వారి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో కరణ్పై నిషా కేసు నమోదు చేసింది. దాంతో ఈ వారి వైవాహిక బంధం ఇబ్బందుల్లో పడిందని సన్నిహితులు పేర్కొన్నారు.
గృహ హింస కేసు నమోదు
ఇలాంటి పరిస్థితుల్లో కరణ్ మెహ్రాపై నిషా రావల్ ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. తనను గృహ హింసకు గురిచేస్తున్నాడు. తనను శారీరకంగా హింసిస్తున్నారనే ఆరోపిస్తూ కరణ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను గోడకు కొట్టడంతో తలకు గాయమైందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో మే 31వ తేదీన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై కరణ్ మెహ్రా విడుదలయ్యారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 336, 337 ప్రకారం కేసు నమోదు చేశారు.
కరణ్ మెహ్రాకు నాలుగు సార్లు కరోనా
గత నెల కరణ్ మెహ్రా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటి వరకు ఆయనకు నాలుగుసార్లు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. కానీ నాలుగు సార్లు కూడా క్షేమంగా బయటపడ్డారు. తన ఆరోగ్యం బాగాలేని ఇలాంటి పరిస్థితుల్లో మీడియాతో మాట్లాడలేను. నా భార్య పెట్టిన కేసు గురించి స్పందించలేను అని కరణ్ మెహ్రా స్పష్టం చేశారు.