Don't Miss!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
భర్త ముందే టీవీ నటిపై అఘాయిత్యం.. ఫుల్లుగా మద్యం సేవించి కారులో..
దేశ రాజధాని ఢిల్లీలో ప్రముఖ టెలివిజన్ నటిని మితి మీరి మద్యం సేవించిన నలుగురు యువకులు వేధించిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తన ఫ్యామిలీతో కలిసి ఓ రెస్టారెంట్లో డిన్నర్ ముగించుకొని వస్తుండగా టీవీ నటి కారును నలుగురు యువకులు వెంటాడంతో కలకలం రేపింది. జనవరి 31వ తేదీన అర్థరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే...
ఫ్యామిలీతో డిన్నర్ ముగించుకొని వస్తుండగా
బాధితురాలు, టెలివిజన్ నటి ఫిర్యాదు ప్రకారం... జనవరి 31వ తేదీ అర్ధరాత్రి అంటే ఫిబ్రవరి తెల్లవారు జామున 2 గంటల సమయంలో భర్త, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్ పార్టీని ముగించుకొని ఇంటికి బయలు దేరాం. ఆ సమయంలో మా కారును ఓ వ్యాగర్ ఆర్ కారు వెంటాడింది. ఆ కారులో నలుగురు యువకులు మద్యం సేవించి ఉన్నారు అని పేర్కొన్నారు.
భర్త ఎదుటే అఘాయిత్యానికి ప్రయత్నం
ఢిల్లీలో రోహిణి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో నా భర్త పక్కనే ఉన్నారు. నా భార్త ఎదుటనే అఘాయిత్యం చేయబోయారు. నన్ను మాటల్లో చెప్పలేని విధంగా దుర్భాషలాడారు. అక్కడి నుంచి మేము ఇంటికి వెళ్తుండగా చాలా కిలోమీటర్లు మా కారును ఛేజ్ చేశారు. ఇంటికి చేరే వరకు మమ్నల్ని భయభ్రాంతులకు గురి చేశారు అని టీవీ నటి తన ఫిర్యాదులో తెలిపారు.
మద్యం మత్తులో మానసికంగా హింసించి
మద్యం మత్తులో మమల్ని పలు రకాలుగా మానసికంగా హింసించారు. రోహిణి ప్రాంతంలోని మా సొసైటికి ఎలాగోలా చేరుకొన్నాం. మా ఇంటిలోకి వెళ్లిన తర్వాత కూడా వారి చేష్టలు మితీ మీరిపోయాయి. వేధింపులు మానలేదు. మా ఇంటిలోకి వచ్చి డోర్పై గట్టిగా బాదుతూ అల్లరి చేశారు. ఆ సమయంలోనే నేను పోలీసులకు కాల్ చేసి పరిస్థితిని వివరించాను అని టీవీ నటి ఆవేదన చెందారు.
Recommended Video
నలుగురు యువకుల అరెస్ట్
టీవీ నటి ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన ఢిల్లీ పోలీసులు కారు నెంబర్ సహాయంతో నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. వారు ఉపయోగించిన కారును సీజ్ చేసు కేసు నమోదు చేశారు. టీవీ నటిని వేధించిన నలుగురిని ఆశీష్ కపూర్, చిరాగ్, కాషిష్ మదన్, ఆయన సోదరుడిగా గుర్తించారు. ఈ ఘటనపై పలువురు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.