twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ నటి శ్రావణి సూసైడ్: మరణానికి ముందు వీడియో వైరల్.. అమ్మాయిలు మోసపోవద్దు అంటూ

    |

    ప్రియుడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొన్న టెలివిజన్ శ్రావణికి సంబంధించిన వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది. తన మరణానికి ముందు ఎస్ఆర్ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన క్రమంలో మీడియాతో మాట్లాడిన వీడియోలో తన ప్రియుడి వేధింపుల గురించి వెల్లడించారు. శ్రావణి చెప్పిన విషయాలు ఏమిటంటే..

    టిక్ టాక్‌, ఇన్స్‌టాగ్రామ్‌తో వలలో

    టిక్ టాక్‌, ఇన్స్‌టాగ్రామ్‌తో వలలో

    ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత శ్రావణి మీడియాతో మాట్లాడుతూ.. దేవరాజు రెడ్డి అనే అతడు టిక్‌టాక్‌ను వాడుకొని అమ్మాయిలను వలలో వేసుకొంటారు. వారి మొబైల్ నంబర్లు తీసుకొని ఇన్స్‌టాగ్రామ్, ఇతర సోషల్ మీడియాలోకి ఆహ్వానిస్తారు. అక్క, చెల్లి అంటూ మెసేజ్‌లు పెట్టి మోసం చేస్తాడు అని శ్రావణి చెప్పారు.

    పరిచయాలు పెంచుకొని డబ్బు లాగుతూ

    పరిచయాలు పెంచుకొని డబ్బు లాగుతూ

    దేవరాజ్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలతో పరిచయాలు పెంచుకొని డబ్బులు వసూలు చేస్తాడు. ఇంకా వారితో తిరుగుతూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. తన మాట వినకపోతే కొట్టడం, దాడులు చేయడం చేస్తుంటాడు. నన్ను ఎవరూ ఏమి చేయరని బెదిరిస్తుంటాడు అని శ్రావణి తెలిపారు.

    అమ్మాయిలను వీడియోలు తీసి బ్లాక్ బెయిల్

    అమ్మాయిలను వీడియోలు తీసి బ్లాక్ బెయిల్

    అమ్మాయిల ఫోన్ నెంబర్లు తీసుకొని బెదిరించడం, పర్సనల్‌గా కలిసి వీడియోలు తీయడం చేస్తుంటాడు. వాటిని ఆధారంగా చేసుకొని అన్ని రకాలుగా బ్లాక్‌మెయిల్ చేస్తుంటాడు. సోషల్ మీడియాలో అమ్మాయిలు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మాటలు చెప్పి బుట్టులో వేసుకొంటాడు. అవసరాల తీరిన తర్వాత వేధిస్తుంటాడు అని శ్రావణి చెప్పారు.

    నాకు తెలిసిన వారే ఐదారుగురు యువతులు

    నాకు తెలిసిన వారే ఐదారుగురు యువతులు

    తన మాదిరిగానే చాలా మంది అమ్మాయిలను బ్లాక్ మెయిల్, మోసాలు చేస్తూ వేధిస్తున్నాడు. నాకు తెలిసిన వారే ఐదు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. దేవరాజ్ కాకినాడకు చెందిన వాడు కానీ సికింద్రాబాద్‌లోనే ఉంటాడు. ఇంతకు ముందు దేవరాజ్‌పై కేసు పెట్టలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అని టెలివిజన్ నటి శ్రావణి వెల్లడించారు. ఇప్పుడు ఈ వీడియో మీడియాలో వైరల్ అవుతున్నారు.

    Recommended Video

    Arjuna Veta Movie Launch | Madhu Sai Vamshi | Sravani | Himabindhu || Filmibeat Telugu
    టెలివిజన్ నటి శ్రావణి సూసైడ్‌తో

    టెలివిజన్ నటి శ్రావణి సూసైడ్‌తో

    గత కొద్ది నెలలుగా వేధింపులకు గురైన శ్రావణి మంగళవారం రాత్రి మధురానగర్‌లోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకొన్నారు. విగత జీవిగా పడి ఉన్నఆమెను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. మనసు మమత, మౌనరాగం లాంటి టెలివిజన్ సీరియల్‌లో నటించి మంచి ప్రేక్షకాదరణను సంపాదించుకొన్నారు. ప్రియుడి వేధింపుల వల్ల జీవితాన్ని అర్ధాంతరంగా చాలించడంతో సన్నిహితులు, స్నేహితులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.

    English summary
    Manasu Mamatha actress Sravani commits suicide in Madhura Nagar of Hyderabad. After Her family found Sravani unconcious, They taken to hospital for treatment. But Doctors declared dead. After her death, reports revealed that, Sravani harrassed by her lover. Her Video before death goes viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X