Don't Miss!
- News చేతిలో చెంబు ఎందుకు పెట్టావ్, లోక్ సభ ఎన్నికల్లో చెంబు రాజకీయాలు, దెబ్బకు వైరల్ !
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రెమ్యునరేషన్ తగ్గించిన టాప్ తెలుగు యాంకర్స్.. సుమకి కూడా ఆ బాధ తప్పట్లేదు!
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా ఖాళీగా ఉన్న బుల్లితెర నటీనటులు మొత్తానికి షూటింగ్స్ తో బిజీ అయ్యారు. మెయిన్ గా నిత్యం టీవిలల్లో కనిపించే యాంకర్స్ కూడా ప్రస్తుతం రియాలిటీ షోలతో బిజీ అయ్యారు. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా యాంకర్స్ రేంజ్ కి తగ్గట్లు రెమ్యునరేషన్ అందుకోవడం లేదట. వారి పేమెంట్స్ చాలావరకు తగ్గినట్లు తెలుస్తోంది.
జీతాల్లో మార్పులు..
రోజుకి రెండు మూడు షోలతో బిజీగా ఉండే యాంకర్స్ ఎప్పటికప్పుడు పేమెంట్స్ అందుకుంటూ ఉండేవారు. కానీ కరోనా కారణంగా ఒక్కసారిగా యాంకర్స్ జీవితాల్లో, జీతాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇక మొత్తానికి షోలు మొదలవుతుండడంతో కాస్త ఉపిరిపీల్చుకుంటున్నారు. అయితే ఎవరికి కూడా వారి రేంజ్ కి తగ్గట్లుగా పేమెంట్స్ అయితే అందడం లేదట.
సుమ కూడా తగ్గించేసింది..
టాలీవుడ్ టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ లాక్ డౌన్ లో క్యాష్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. గతంలో ఎపిసోడ్ కి లక్షన్నర నుచి రెండు లక్షల వరకు పేమెంట్స్ అందుకున్న సుమ కూడా ఇప్పుడు లక్ష వరకే అందుకుంటున్నట్లు తెలుస్తోంది. గత మూడు నెలల నుంచి ఆదాయం లేకపోవడంతో ప్రొడక్షన్ పరిస్థితులను అర్థం చేసుకొని సుమ రెమ్యునరేషన్ అందుకుంటోదట.
ఈవెంట్స్ దెబ్బ..
షోలకు మంచి రేటింగ్స్ దక్కితే మళ్ళీ వెంటనే పేమెంట్స్ పెంచే విధంగా యాంకర్స్ ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. మెయిన్ గా యాంకర్స్ కి ఆడియో ఈవెంట్స్ దెబ్బ గట్టిగా పడిందనే చెప్పాలి. ఒక్కో ఈవెంట్ కి 2 నుంచి 3లక్షల వరకు అందుకునే లిస్ట్ లో సుమతో పాటు అనసూయ, రష్మీలు కూడా ఉన్నారు.
జబర్దస్త్ యాంకర్స్..
ఇక జబర్దస్త్ షోకు కూడా లక్షల్లో ఆదాయం అందుకునే అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ కూడా ఇప్పుడు ఆ విషయంలో కాస్త డోస్ తగ్గించినట్లు తెలుస్తోంది. ఎప్పటిలానే షోలు రెగ్యులర్ గా క్లిక్కయితే మళ్ళీ పాత పేమెంట్స్ ఇచ్చే విధంగా షో నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇటీవల జబర్దస్త్ షోలు రెండు కూడా మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
Recommended Video
శ్రీ ముఖి.. మంజూష.. పరిస్థితేంటి?
వీరి పరిస్థితే ఇలా ఉంటే.. శ్రీ ముఖి, మంజూష వంటి యాంకర్స్ పరిస్థితి కొంచెం కష్టంగానే ఉందని చెప్పవచ్చు. ఎక్కువగా బయట ఈవెంట్స్ తో బిజీగా ఉండే పార్ట్ టైమ్ యాంకర్స్ కి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. అందుకే కొంతమంది యూ ట్యూబ్ ఛానెల్స్ ని క్రియేట్ చేసి సొంత స్టైల్ లో ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.