Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వ్యభిచారం కేసులో తెలుగు టీవీ సీరియల్ నటి,నిర్మాత అరెస్టు
ఇన్స్పెక్టర్ పి. మురళీకృష్ణ కథనం ప్రకారం... విజయవాడకు చెందిన రాజు అలియాస్ రాజేష్ నిర్మాత అవతారమెత్తి శ్రీనగర్కాలనీ సమీపంలోని ప్రగతినగర్లో ఓ ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నాడు. శ్రీవెంకటకృష్ణ ఫిలిమ్స్ పేరిట కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. తాము నిర్మించే సినిమాలో హీరోయిన్ వేషం కోసం అందమైన అమ్మాయి కావాలని ఏడాది కాలంగా ప్రకటనలు ఇస్తున్నాడు.
ఈ ప్రకటనకు ఆకర్షితులై తన కార్యాలయానికి వచ్చిన వారితో కోరిక తీరిస్తేనే హీరోయిన్ వేషం దొరుకుతుందని మభ్యపెట్టి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నాడు. ఇదే విధంగా బుల్లితెర నటి పుష్పాంజలి (22) ఇతని ఉచ్చులోపడి వ్యభిచారిణిగా మారింది. స్వప్న (24) అనే మరో యువతి కూడా వేషం కోసం వచ్చి వ్యభిచార గృహంలో మగ్గుతోంది.
రాజేష్ వ్యవహారంపై సమాచారం అందుకున్న పో లీసులు ఆదివారం అతని కార్యాలయంపై మెరుపుదాడి చేశారు. పుష్పాంజలితో పాటు స్వప్న, విటుడు పవన్కుమార్, కార్యాలయం మేనేజర్ లోకేష్ పోలీసులకు చిక్కగా.. నిర్మాత రాజేష్ పరారయ్యాడు. ఏడాది కాలంగా సుమారు 25 మంది యువతులను రాజేష్ వ్యభిచార కూపంలోకి లాగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.