Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బుల్లితెర తారల పోరుబాట, అండగా నిలిచిన దాసరి
తెలగు టీవీ కళాకారులు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి దర్శకరత్న దాసరి నారాయణరావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమ మాదిరి, తెలుగు టీవీ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఆధారపడి జీవిస్తున్నారని, డబ్బింగ్ సీరియళ్లను నిషేదించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇతర రాష్ట్రాల్లో మాదిరి ఆంధ్రప్రదేశ్లో మాతృభాషపై ఇక్కడి వారికి అభిమానం లేదని, పక్క రాష్ట్రాల వారు భాషాభిమానం చూపిస్తుంటే.... మన వద్ద కనీస బాధ్యత ఎవరూ వహించడం లేదని దాసరి ఆవేదన వ్యక్తం చేసారు. తెలుగు భాషను, తెలుగు కళాకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.
ఈ ఆందోళన ఇలా ఉంటే... డబ్బింగ్ సీరియల్స్ నిషేదిస్తే తమకు ఉపాది కరువవుతుందని, తామంతా రోడ్డున పడతామని డబ్బింగ్ ఆర్టిస్టులు ఆందోళన చేపట్టారు. డబ్బింగ్ సీరియల్స్ను నిషేదిస్తే తామంతా ఆందోళనకు దిగుతామని డబ్బింగ్ కళాకారులు అంటున్నారు.