Don't Miss!
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
సినిమా, టీవీ వాళ్లను మించిపోయిన టిక్ టాక్ సెలబ్రిటీ దారుణ హత్య!
సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉంటడటం అంటే ఆశామాషీ కాదు. ఈ విషయంలో సినిమా, టీవీ, స్పోర్ట్స్ రంగానికి చెందిన సెలబ్రిటీలే టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు. అయితే టిక్ టాక్ లాంటి యాప్స్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా తీరే పూర్తిగా మారిపోయింది. తమ టాలెంట్ ప్రదర్శిస్తూ సాధారణ వ్యక్తులు కూడా సెలబ్రిటీలుగా అవతరిస్తున్నారు.
ఇండియాలో పాపులర్ అయిన టిక్ టాక్ యాప్లో లక్షల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న మోహిత్ మోర్ అనే 27 ఏళ్ల యువకుడు హత్యకు గురవ్వడం ఢిల్లీలో సంచలనంగా మారింది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని తుపాకీతో కాల్చి చంపారు.
13 బుల్లెట్లు దించారు
ముఖాలు కనిపించకుండా హెల్మెట్ పెట్టుకుని వచ్చిన దుండగులు నజఫ్గఢ్ ప్రాంతంలో ఓ ఫొటో స్టూడియో వద్ద మోహిత్ మోర్ను హత్య చేశారు. తుపాకీతో వరుస రౌండ్లు కాల్పులు జరిపారు. 13 బుల్లెట్లు దిగడంతో మోహిత్ అక్కడికక్కడే మరణించాడు.
సినిమా, టీవీ సెలబ్రిటీల తరహాలో 50 లక్షల మంది ఫాలోవర్స్
మోహిత్ మోర్ టిక్ టాక్ యాప్లో దాదాపు 50 లక్షల మంది ఫాలోవర్స్ కలిగి ఉన్నాడు. తన అభిమానులను ఎంటర్టెన్ చేస్తూ నిత్యం వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. సినిమా, టీవీ సెలబ్రిటీల తరహాలో తనకంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. మోహిత్ మెర్ హత్య అభిమానులను షాక్కు గురి చేసింది.
తమ గ్యాంగ్ అంటే భయం క్రియేట్ చేయడానికే హత్య
స్థానికంగా జిమ్ ట్రైనర్గా పని చేస్తున్నా మోహిత్ మోర్ హత్యకు కారణం గ్యాంగ్ వార్ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్యకు పాల్పడిన వారితో మోహిత్కు గొడవలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తమ గ్యాంగ్ అంటే భయం క్రియేట్ చేయడానికే మరో గ్యాంగ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చర్చించుకుంటున్నారు.
సీరియస్గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు
మోహిత్ మోర్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం కావడంతో ఢిల్లీ పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అతడి టిక్ టాక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, కాల్ డేటా పరిశీలిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు.