ప్రభాస్ కు క్షమాపణ చెప్పిన తెలుగు కమిడియన్(వీడియో)
హైదరాబాద్: తనకు ప్రభాస్ ని అనాలనే ఆలోచన లేదని,తనకు చాలా గౌరవమని, వేరే ఇంటన్షన్ తమకు లేదని తెలుగు హాస్య నటుడు హరీష్ (చందమామలో అమృతం ఫేమ్) అన్నారు. రీసెంట్ గా ఈ టీవీలో ప్రసారమైన జబర్ధస్త్ షో లో ప్రభాస్ ని ఓ పెద్దావడ గుర్తు పట్టలేదంటూ ఓ కామెడీ స్కిట్ చేసారాయన. అయితే అది చాలా విమర్శలు పాలైంది. ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆయన మెసేజ్ లు,ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన బహిరంగంగా క్షమాపణ ని యూ ట్యూబ్ వీడియో ద్వారా కోరారు. మీరూ చూడండి....
ఇక ప్రభాస్ తాజా చిత్రం 'బాహుబలి' విశేషాలు కి వస్తే...
'బాహుబలి' గా ప్రభాస్ రూపమేంటో ఇప్పటికే ప్రేక్షకులకు చూపించారు రాజమౌళి. తొలి రూపు (ఫస్ట్లుక్)తోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో రెండో పోస్టరును విడుదల చేశారు. ఈ రెండు ఈ వీరుడి సాధారణ రూపాలు. మరి యుద్ధభూమిలో 'బాహుబలి' ఎలా ఉండబోతున్నాడు అనే ఆతృత అందరిలోనూ కలిగింది. దీనికి సమాధానంగా ఆయుధంతో వీరత్వం ప్రదర్శిస్తోన్న బాహుబలి పోస్టరును తాజాగా ఫేస్బుక్లో పెట్టారు.

ఓ వైపు సినిమా చిత్రీకరణ జరుగుతుంటే మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. లీ మాస్టర్ నేతృత్వంలో రామోజీ ఫిల్మ్సిటీలో రానాపై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు.
రాజమౌళి కొత్త ఆలోచన: లైవ్ యాక్షన్ సినిమా, విజువల్ ఎఫెక్ట్స్ ఆధారిత సినిమా.. ఈ రెండింటికీ మధ్య తేడాలున్నాయి. కెమెరా ముందు జరుగుతున్న సన్నివేశాన్ని యథాతథంగా చూపించడం లైవ్ యాక్షన్ సినిమా. ఖాళీ ప్రదేశంలో బ్లూమేట్ ముందు చిత్రీకరించి ఆ తర్వాత దానికి విజువల్ ఎఫెక్ట్స్ జోడించి ఏ పెద్ద కోట లోపలో, లేదా కోట ముందో ఉన్నట్లు చూపించడం విజువల్ ఎఫెక్ట్స్ ఆధారిత చిత్రమవుతుంది. రెండో రకం చిత్రీకరణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎదురుగా ఏమీ లేకుండానే ఉన్నట్లు భావించి నటించాల్సి వస్తుంది.
ఇలాంటి సన్నివేశాలకు దర్శకత్వం వహించడం కష్టసాధ్యమైన పనే. అందుకే బ్లూమేట్ ఆధారంగా తీసే సన్నివేశాల చిత్రీకరణ సమయంలోనే కళ్లకు విజువల్ ఎఫెక్ట్స్ కనపడేలా చేస్తే బాగుంటుందన్న ఆలోచన కలిగింది దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి. ఆయన తాజా చిత్రం 'బాహుబలి' కోసం ఏఎండీ అనే విజువల్ ఎఫెక్ట్స్ సంస్థతో కలసి పని చేస్తున్నారు. ఈ పనిలో మరో సంస్థ మకుట కూడా పాలుపంచుకుంటోంది. ఏఎండీ తాజాగా ఓ మైక్రోచిప్ తయారు చేసే పనిలో ఉందట.
ఓ చిప్లో మొత్తం ఎఫెక్ట్స్ను అప్లోడ్ చేసి దాన్ని కళ్లజోడుకు జోడించి చూస్తే బ్లూమేట్ మీద ఏమైతే విజువల్ ఎఫెక్ట్స్ని మిక్స్ చేస్తారో.. అవి కనిపిస్తాయి. దీని వల్ల చిత్రీకరణ సులభతరమవుతుంది. రాజమౌళి అయితే వీలైనంత త్వరలో ఈ సాంకేతికత అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నారు. ఈ విషయం గురించి రూపొందించిన వీడియోను తన ఫేస్బుక్ పేజీలో పెట్టారు.


Click it and Unblock the Notifications











