twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నమ్మించి పెళ్లాడిన నిర్మాత.. ఇప్పుడు వ్యభిచారం చేయాలంటున్నాడంటూ నటి సూసైడ్ అటెంప్ట్!

    |

    సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం అని దాదాపు అందరికీ తెలుసు. అందుకే కొంతమంది దానికి దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తుంటే కొంతమంది మాత్రం ఏది ఏమైనా సరే తాము కూడా ఇప్పుడు అలాగే వెలిగిపోవాలని ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అలా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కొంతమంది సఫలీకృతం అవుతుంటే అధిక భాగం మాత్రం నిరాశ నిస్పృహలతో వెనుదిరగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.. అయితే కొంతమంది సైలెంట్ గా వెనక్కి వెళ్లి పోతే మరి కొంత మంది మాత్రం కేటుగాళ్ల మాటలు విని వాళ్ల మాయలో పడుతూ ఉంటారు. తాజాగా ఒక నిర్మాత మాయలో పడిన నటి ఇప్పుడు రోడ్డెక్కవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాల్లోకి వెళితే

    వెనకడుగు వేయకుండా

    వెనకడుగు వేయకుండా

    సినీ పరిశ్రమ అనేది ఒక రంగుల ప్రపంచం. అలాగే దాదాపు ఏడాదికి రెండు వందలకు పైగా సినిమాలు విడుదల అవుతూ ఉంటే కేవలం 10 లోపు సినిమాలు మాత్రమే హిట్ గా సూపర్ హిట్ గా నిలుస్తూ ఉంటాయి. అయితే ఎలా అయినా నటులుగా తమని తాము నిరూపించుకోవాలని ఉద్దేశంతో చాలా మంది వెనకడుగు వేయకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు మరీ ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే వాళ్లను లైంగికంగా వేధించే వాళ్ళు కూడా ఉంటారు.

     నిర్మాత అని చెప్పి

    నిర్మాత అని చెప్పి

    అలాగే కొంతమంది వారిని మోసం చేసి వివాహం చేసుకోవాలని ఆలోచనతో కూడా ఉంటారు. అలా తమిళ సినీ పరిశ్రమలో ఎలా అయినా నిలదొక్కుకోవాలని ఉద్దేశంతో పరమేశ్వరి అనే యువతి చెన్నై వెళ్ళింది. భైరవి అనే పేరు మార్చుకుని ఆమె టీవీ రంగంలో అడపాదడపా సీరియల్స్ లో నటిస్తోంది. తాజాగా ఈనెల 25వ తేదీన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో వేలూరు ప్రాంతానికి చెందిన రాజా దేవ్ సింగ్ అలియాస్ సుబ్రమణి అనే వ్యక్తి తనకు ఒక నిర్మాత అని చెప్పి పరిచయం అయ్యాడు అని పేర్కొంది.

    వ్యభిచారంలోకి దిగమని

    వ్యభిచారంలోకి దిగమని


    ఆ తర్వాత షూటింగ్ లో భాగంగా ఒక ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ప్రదేశానికి తీసుకు వెళ్లి ఒక గుడిలో నిన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను పెళ్లి చేసుకున్నాడు అని ఆమె పేర్కొన్నారు.. ఆ తరువాత నేను నీ భర్త ని నేను ఎలా చెబితే అలా చేయాలి అంటూ వ్యభిచారంలోకి దిగమని ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

    కిరోసిన్ పోసుకుని

    కిరోసిన్ పోసుకుని

    అయితే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని భావించిన ఆమె అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని ఆరోపిస్తూ సోమవారం నాడు ఏకంగా చెన్నైలో ఉన్న తమిళనాడు డీజీపీ ఆఫీస్ కి వెళ్లి ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే పోలీసులు అక్కడి నుంచి ఆమెను ఆసుపత్రికి తరలించారు.

    త్వరలోనే

    త్వరలోనే

    ఆమె మీద ఆత్మహత్యాయత్నం చేసిన కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఇచ్చిన ఫిర్యాదును కూడా పరిశీలిస్తున్నారు. త్వరలోనే సదరు నిర్మాతను ట్రేస్ చేసి అరెస్ట్ చేస్తామని విచారణ జరిపి తగిన సాక్ష్యాధారాలతో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

    Read more about: bhairavi
    English summary
    TV Actress Bhairavi Attempts Suicide At Chennai DGP Office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X