Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సైబర్ క్రైమ్లో టీవీ సీరియల్ నటుడి అరెస్ట్
ఏసీపీ చిట్టిబాబు కథనం ప్రకారం... గుంటూరుజిల్లా రేపల్లెలోని కూచినపూడికి చెం దిన రామారావు జగద్గిరిగుట్టలో నివసిస్తున్నా డు. ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బు దండుకొని మోసం చేయాలని పథకం వేశాడు. బోగస్ చిరునామాతో ఇంటర్నెట్లో goldenlandagrotech.కామ్ పేరుతో వెబ్సైట్ ప్రారంభించాడు. వర్క్ ఫ్రమ్ హోం అంటూ జనాలను బోల్తా కొట్టించాడు.
తమకు ఆర్గానిక్ ఉత్పత్తుల నుంచి ఆవులు, గొర్రెల ఫామ్స్ వరకు అనేక వ్యాపారాలున్నాయ ని పేర్కొన్నాడు. తమ సంస్థలో స్టేట్హెడ్ నుంచి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ (బీడీఈ) వరకు అ నేక పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ దరఖాస్తులు ఆహ్వానించాడు.
స్టేట్హెడ్కు నెలకు రూ.25 వేల జీ తం, స్కార్పియో వాహనం, జిల్లా మేనేజర్కు రూ.15 వల జీతంతో పాటు రవాణా, కరువు భత్యాలు, ఇండికాకారు, ఏరియా మేనేజర్కు రూ.10 వేల జీతం, బైక్, బీడీఈలకు రూ.7500 జీతం ఇస్తానంటూ వల వేశాడు. తన వల్లో పడిన దాదాపు 30 మంది విద్యార్థుల నుంచి రామారావు రిజిస్ట్రేషన్ ఫీజ్ పేరుతో రూ.4.5 లక్షలు వసూలు చేసి పరారయ్యాడు.
బాధితులు వెబ్సైట్లోని చిరునామా ఆధారంగా వెతుక్కుంటూ వెళ్లగా అది బోగస్ది అని తేలింది. దీంతో మోసపోయామని గ్ర హించిన అమీర్పేటకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి వరుణ్కుమార్ సీసీఎస్లో సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ మాజిద్ అలీ ఖాన్ నేతృత్వంలో పోలీసు బృందం సాంకేతి క ఆధారాల స హాయంతో రామారావు ఆచూకీ కనుగొని అరెస్టు చేసింది.