Don't Miss!
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
సైబర్ క్రైమ్లో టీవీ సీరియల్ నటుడి అరెస్ట్
ఏసీపీ చిట్టిబాబు కథనం ప్రకారం... గుంటూరుజిల్లా రేపల్లెలోని కూచినపూడికి చెం దిన రామారావు జగద్గిరిగుట్టలో నివసిస్తున్నా డు. ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బు దండుకొని మోసం చేయాలని పథకం వేశాడు. బోగస్ చిరునామాతో ఇంటర్నెట్లో goldenlandagrotech.కామ్ పేరుతో వెబ్సైట్ ప్రారంభించాడు. వర్క్ ఫ్రమ్ హోం అంటూ జనాలను బోల్తా కొట్టించాడు.
తమకు ఆర్గానిక్ ఉత్పత్తుల నుంచి ఆవులు, గొర్రెల ఫామ్స్ వరకు అనేక వ్యాపారాలున్నాయ ని పేర్కొన్నాడు. తమ సంస్థలో స్టేట్హెడ్ నుంచి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ (బీడీఈ) వరకు అ నేక పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ దరఖాస్తులు ఆహ్వానించాడు.
స్టేట్హెడ్కు నెలకు రూ.25 వేల జీ తం, స్కార్పియో వాహనం, జిల్లా మేనేజర్కు రూ.15 వల జీతంతో పాటు రవాణా, కరువు భత్యాలు, ఇండికాకారు, ఏరియా మేనేజర్కు రూ.10 వేల జీతం, బైక్, బీడీఈలకు రూ.7500 జీతం ఇస్తానంటూ వల వేశాడు. తన వల్లో పడిన దాదాపు 30 మంది విద్యార్థుల నుంచి రామారావు రిజిస్ట్రేషన్ ఫీజ్ పేరుతో రూ.4.5 లక్షలు వసూలు చేసి పరారయ్యాడు.
బాధితులు వెబ్సైట్లోని చిరునామా ఆధారంగా వెతుక్కుంటూ వెళ్లగా అది బోగస్ది అని తేలింది. దీంతో మోసపోయామని గ్ర హించిన అమీర్పేటకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి వరుణ్కుమార్ సీసీఎస్లో సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ మాజిద్ అలీ ఖాన్ నేతృత్వంలో పోలీసు బృందం సాంకేతి క ఆధారాల స హాయంతో రామారావు ఆచూకీ కనుగొని అరెస్టు చేసింది.