Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జబర్దస్త్ కమెడియన్ భార్య ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?
కమెడియన్ రమేష్ భార్య త్రిపురాంభిక ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖ గాజువాకలోని శ్రీనగర్ కాలనీలో నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
విశాఖ: జబర్దస్త్ కమెడియన్ భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విశాఖలో చోటు చేసకుంది. కమెడియన్ పొట్టి రమేష్ భార్య త్రిపురాంభిక ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖ గాజువాకలోని శ్రీనగర్ కాలనీలో నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
జబర్దస్త్ కార్యక్రమంతో పాటు భలే ఛాన్స్ లే లాంటి టీవీ షోల ద్వారా పాపులర్ అయిన రమేష్ గతేడాది డిసెంబర్ 12న త్రిపురాంబికను పెళ్లాడారు. త్రిపురాంబిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే రమేష్ విశాఖ చేరుకున్నారు.
తమ మధ్య ఎలాంటి మనస్పర్దలు లేవని, ఇలా ఎందుకు జరిగిందో తెలియదని రమేష్ తెలిపారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొట్టి రమేష్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
త్రిపురాంబిక తల్లి దండ్రుల ఆరోపణలు
త్రిపురాంబిక తల్లిదండ్రులు, బంధువులు విశాఖ కేజీహెచ్కు చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి శోకసముద్రంలో మునిగిపోయారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, పెళ్లైన మరుసటిరోజు నుంచే అత్త, ఆడపడుచు వేధించే వారని వారు ఆరోపించారు.
తల్లి ఆరోపణ
త్రిపురాంబిక తల్లి ఈ సందర్భంగా మాట్లాడుతూ...మా అమ్మాయిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరుపాలని, పోలీసులు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
బెదిరింపు కాల్స్
ఈ ఘటనపై మహిళా సంఘం నేత ప్రభావతి మాట్లాడుతూ కేసులు పెట్టొద్దంటూ త్రిపురాంబిక కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. ఈ కేసును పోలీసులు నిష్పాక్షింగా విచారణ జరపాలని కోరారు.
రమేష్ దిగ్భ్రాంతి
తమ మధ్య ఎలాంటి మనస్పర్దలు లేవని, ఇలా ఎందుకు జరిగిందో తెలియదని రమేష్ తెలిపారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొట్టి రమేష్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.