Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Karthika Deepam దేవుడు పేరు ఎత్తకు.. తుపాకీ ఎక్కు పెట్టిన మోనిత
మోనితకు ఆనంద్ను ఇచ్చిన తర్వాత కార్తీక్ కుటుంబం భావోద్వేగానికి గురైంది. ఆ తర్వాత చిక్మంగళూరుకు పిల్లలతో కలిసి దీప, కార్తీక్ ట్రిప్ వెళ్లారు. అయితే వారు విహార యాత్రకు వెళ్లడంపై పూజారి కీడు శంకించాడు. సౌందర్య, ఆనందరావుతో మాట్లాడుతూ.. ఎక్కడైతే కార్తీక్, దీప మధ్య అనుమానాలు మొదలయ్యాయో.. ఎక్కడైతే వారి అనుబంధం బీటలు వారిందో.. అదే చిక్మగ్ళూరుకు వెళ్లి పొరపాటు చేశారనిపిస్తుందమ్మ. పోయిన జన్మలో చేసిన పాపాలు వెంటాడుతుంటాయి అంటారు అని పూజారి అంటే.. ఏంటి పూజారి? ఎందుకలా అంటున్నారు? అని సౌందర్య అడిగితే...కొన్ని స్థలాల ప్రభావాలు అలా ఉంటాయి. వీలైతే వారిని వెనుకకు వచ్చేయండి అంటూ పూజారి సలహా ఇచ్చాడు. దాంతో సౌందర్య, ఆనందరావులో ఆందోళన మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1293లో ఏం జరిగిందంటే?
కాలం పగపట్టింది అంటూ
పూజారి చెప్పిన మాటలతో సౌందర్య కంగారుపడింది. అయితే పూజారి జాగ్రత్తలు చెప్పాడు కానీ.. ముప్పు ఉందని చెప్పలేదు కదా అని ఆనందరావు అన్నాడు. ఆదిత్య, శ్రావ్య కూడా జాగ్రత్త తీసుకొంటే చాలు.. మీరు అంతగా ఆందోళన చెందవద్దుఅ ని సూచించారు. అయితే వారి జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలు మామూలివి కావు. కాలమే పగపట్టి వారిని విడదీసింది. కష్టాలు, కలతలతోనే వారి జీవితం గడిచిపోయింది. అలాంటిది ఇప్పుడు వారిద్దరు ఆనందంగా జీవితాన్ని గడపాలని సంతోషాలను వెతుక్కొంటూ వెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఎలాంటి ఆపద వస్తుందో అనే భయం వెంటాడుతున్నది అని సౌందర్య అంటే.. ఇక్కడ ఉంటే.. ఏదో ప్రమాదం ఉందని అనుకొనే వాళ్లం. వాళ్లు ట్రిప్ మంచిగా ఎంజాయ్ చేసుకొని వస్తారు అని ఆదిత్య అన్నాడు. అయితే ఒకసారి దీపతో మాట్లాడితే కానీ మనసు ప్రశాంతంగా ఉండదు అని సౌందర్య అంది.
ఒక్క తప్పుకు పెద్ద శిక్ష అంటూ కార్తీక్
చిక్మగుళూరుకు వెళ్తూ దారిలో కార్తీక, దీప తమ జీవితంలో చోటుచేసుకొన్న సంఘఠనలు గుర్తు చేసుకొన్నారు. ఇక్కడే తను, నేను జీవితంలో గొప్ప క్షణాలను ఆస్వాదించాం. కానీ రచయితతో జరిగిన సంఘటనలు మా జీవితాలను వేరు చేసింది అంటూ గతాన్ని గుర్తు చేసుకొన్నది. దీప అలా ఆలోచిస్తుంటే.. కార్తీక్ దగ్గరకు వచ్చి.. దీప.. నేను మూర్ఖంగా ఆలోచించి నిన్ను బాధపడ్డాను. ఒక్క తప్పుకు సంవత్సరాల కొద్ది శిక్ష పడింది అని కార్తీక్ అంటే.. అలా అనకు డాక్టర్ బాబు.. ఓ వైపు కన్నీళ్లు.. మరోవైపు ఆనందం. నేను ఇక్కడికి రాగానే నన్ను నేను మరిచిపోతున్నాను. ఇక్కడికి రాగానే అన్నీ గుర్తుకు వస్తున్నాయి. ఆ గాయం నన్ను ఇంకా బాధిస్తూనే ఉంది. నిన్ను అనుమానించి 11 ఏళ్లు నీకు దూరమయ్యాను. వీలైతే నన్ను క్షమించు దీప అని కార్తీక్ అంటే.. నీ తప్పు ఏమీలేదు. మోనిత నిన్ను తప్పుదోవ పట్టించింది అని మోనిత అంది.. మన జీవితంలో మోనిత విష వృక్షం నాటింది అని కార్తీక్ అంటే.. మోనిత మన జీవితంలో చేయాల్సిన నష్టం చేసింది. ఆమెను మరిచిపోదాం అంటూ దీప అనుకొన్నది.
మోనిత ఏం చేసింది అంటూ హిమ
కార్తీక్,
దీప
గురించి
మాట్లాడుకొంటుంటే..
మోనిత
ఆంటీ
ఏం
చేసింది?
మోనిత
ఆంటీ
మంచిదే
కదా..
మోనిత
ఏం
చేసింది?
అని
హిమ
అడిగితే..
కార్తీక్,
దీప
ఇద్దరు
ముఖాలు
చూసుకొన్నారు.
డాడీ
మాట్లాడవేంటి?
మోనిత
ఏం
చేసింది?
నీ
ఫ్రెండే
కదా..
అని
హిమ
ప్రశ్నలు
వేస్తే..
అందరూ
మంచి
వాళ్లే..
సమయం
బాగా
లేకపోతే..
కొన్నిసార్లు
అలానే
ఉంటుంది
అని
దీప
అంటే..
మనం
ఇక్కడికి
వచ్చింది
ఎంజాయ్
చేయాలి.
మిగితా
విషయాలు
పట్టించుకోవద్దు
అని
కార్తీక్
అంటే..
మీకు
ఎలాంటి
కండీషన్స్
లేవు.
ఇష్టం
వచ్చినట్టు
గడుపుదాం
అని
కార్తీక్
చెప్పాడు.
తుపాకీ ఎక్కువపెట్టిన మోనిత
ఇక కార్తీక్ కుటుంబంతో ఎదురైన అవమాన భారాన్ని మోనిత జీర్ణించుకోలేకపోయింది. తుపాకీ పట్టుకొని నిలుచొని ఉంటే.. పనిమనిషి అరుణ వచ్చి.. అమ్మా ఏంటి అమ్మా.. తుపాకీ పట్టుకొని ఉన్నావు.. నీకు ఏమీ కాదు.. దేవుడు అంతా చూసుకొంటాడు అంటూ ఏదో చెప్పబోయింది. దాంతో తుపాకీ అరుణకు ఎక్కు పెట్టింది. దేవుడి పేరు ఎత్తకు.. దేవుడు నాకు ఏం చేసిండు అంటూ గట్టిగా మోనిత అరిచింది. ఆ తర్వాత తేరుకొని.. సారీ అరుణ.. నేను ఆవేశంలో ఏదో అన్నాను అని సర్ది చెప్పుకొన్నది. దేవుడి కంటే.. తుపాకీ నాకు మేలు చేస్తుంది. దానిని నమ్ముకుంటే చాలా బాగుంటుంది అని మోనిత మనసులో అనుకొన్నది.
కార్తీకదీపం సీరియల్ రేటింగ్ ఇలా..
కార్తీకదీపం సీరియల్లో ట్విస్టుల పర్వం కొనసాగుతున్నది. చిక్మంగుళూరులో కార్తీక్, దీప, హిమ, శౌర్య ఆనందంగా ట్రిప్ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఎమోషనల్ సన్నివేశాల మధ్య కార్తీక్, దీప విహార యాత్రను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దీపను చూస్తూ.. నిన్నిలా చూస్తే.. నాకు ఇదే చివరి రోజు అయినా పర్వాలేదనిపిస్తుంది అని కార్తీక్ అనగానే.. దీప వెంటనే నోటికి చేయి అడ్డుపెట్టి.. అలా అనకు అని చెప్పింది. ఇక కార్తీకదీపం సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే.. 13.11 రేటింగ్ను తాజా వారానికి నమోదు చేసుకొన్నది.