Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
‘నారీ నారీ నడుమ మురారి’అంటున్న ఉదయ భాను
తన హొయిలుతో,మాటకారితనంతో అదరకొట్టే ఉదయభాను తో తాజాగా 'నారీ నారీ నడుమ మురారి' అనే వినూత్న కార్యక్రమానికి జీ తెలుగు చానల్ శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ప్రతి బుధవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. దీనికి సంబంధించిన ప్రతి ఎపిసోడ్లోనూ ఒక మేల్ సెలబ్రిటీ, ఇద్దరు ఫిమేల్ సెలబ్రిటీలు పాల్గొంటారు. మేల్ సెలబ్రిటీ కోసం ఫిమేల్ సెలబ్రిటీస్ పోటీపడటం ఈ కార్యక్రమం ప్రత్యేకత.
ఆటపాటల అల్లరితో ఆద్యంతం సరదాగా సాగిపోయే విధంగా ఈ కార్యక్రమం మలచబడిందని జీ తెలుగువారు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఉదయభాను వ్యాఖ్యానం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఈ పోగ్రాంని ఆమె తనదైన శైలిలో రక్తి కట్టిస్తుందని పోగ్రాం డైరక్టర్స్ నమ్మకంగా ఉన్నారు. అన్ని హంగులతో, ఆకర్షణలతో బుల్లితెర వీక్షకులను ఆకట్టుకునే విధంగా పూర్తి వినోదభరితంగా రూపొందుతోన్న ఈ కార్యక్రమం తప్పకుండా అందరికీ నచ్చుతుందని జీ యాజమాన్యం నమ్మకం వ్యక్తం చేశారు.
ఇక నారీ నారి నడుమ మురారి టైటిల్ తో బాలకృష్ణ ఓ చిత్రం చేసారు. కోదండరామిరెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఆ చిత్రం సూపర్ హిట్. జంద్యాల రచన చేసిన ఈ చిత్రంలో నిరోష,శోభన నటించారు. ఇప్పుడీ పోగ్రాంకి ఆ టైటిల్ పెట్టడంతో అందరికీ ఈ సినిమా గుర్తుకు వస్తోంది.