Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘నారీ నారీ నడుమ మురారి’అంటున్న ఉదయ భాను
తన హొయిలుతో,మాటకారితనంతో అదరకొట్టే ఉదయభాను తో తాజాగా 'నారీ నారీ నడుమ మురారి' అనే వినూత్న కార్యక్రమానికి జీ తెలుగు చానల్ శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ప్రతి బుధవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. దీనికి సంబంధించిన ప్రతి ఎపిసోడ్లోనూ ఒక మేల్ సెలబ్రిటీ, ఇద్దరు ఫిమేల్ సెలబ్రిటీలు పాల్గొంటారు. మేల్ సెలబ్రిటీ కోసం ఫిమేల్ సెలబ్రిటీస్ పోటీపడటం ఈ కార్యక్రమం ప్రత్యేకత.
ఆటపాటల అల్లరితో ఆద్యంతం సరదాగా సాగిపోయే విధంగా ఈ కార్యక్రమం మలచబడిందని జీ తెలుగువారు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఉదయభాను వ్యాఖ్యానం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఈ పోగ్రాంని ఆమె తనదైన శైలిలో రక్తి కట్టిస్తుందని పోగ్రాం డైరక్టర్స్ నమ్మకంగా ఉన్నారు. అన్ని హంగులతో, ఆకర్షణలతో బుల్లితెర వీక్షకులను ఆకట్టుకునే విధంగా పూర్తి వినోదభరితంగా రూపొందుతోన్న ఈ కార్యక్రమం తప్పకుండా అందరికీ నచ్చుతుందని జీ యాజమాన్యం నమ్మకం వ్యక్తం చేశారు.
ఇక నారీ నారి నడుమ మురారి టైటిల్ తో బాలకృష్ణ ఓ చిత్రం చేసారు. కోదండరామిరెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఆ చిత్రం సూపర్ హిట్. జంద్యాల రచన చేసిన ఈ చిత్రంలో నిరోష,శోభన నటించారు. ఇప్పుడీ పోగ్రాంకి ఆ టైటిల్ పెట్టడంతో అందరికీ ఈ సినిమా గుర్తుకు వస్తోంది.