Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నిగ్గదీసి అడగమంటున్న ఉదయభాను
హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ ఉదయ్ భాను గత కొంత కాలంగా రాజకీయాల్లోకి వస్తుందనే వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఆమె రాజకీయాల్లోకి వస్తుందో లేదో కానీ ఇప్పుడు పొలిటీషియన్స్ ని నిలదీయమంటూ ఓ పాపులర్ టీవీ ఛానెల్ కు ఓ పోగ్రాం చేస్తోంది. ఆ పోగ్రాం పేరు నిగ్గదీసి అడుగు. ఈ పోగ్రాం ద్వారా ఆమె రాజకీయనాయుకులపై అవగాహన పెంచనుంది. తెలంగాణా, ఆంధ్రా,రాయలసీమ ఎక్కడైనా ప్రజలే బాధితులు...మాట తప్పే నాయకులను సహించవద్దు...మీ కష్టాలను నాతో చెప్పండంటూ ముందుకు వస్తోంది. టీవీ 9లో ఈ పోగ్రాం ప్రసారం కానుంది. ఈ పోగ్రాం నిమిత్తం ఆమె సామాన్యులను కలవనుంది. అందుకోసం ఆమె టూర్ వేయనుంది.
ఇక గత కొంత కాలంగా రాజకీయాల్లోకి వస్తుందంటూ ప్రచారం సాగుతున్న టీవీ యాంకర్, నటి ఉదయభాను ఈ పోగ్రామ్ తో కంక్లూజన్ కి వచ్చినట్లే అంటున్నారు. మారిన రాష్ట్ర పరిస్థితులు, తెలంగాణ ఏర్పాటు వంటి కారణాలతో ప్రస్తుతం రాజకీయ రంగమంతా గందరగోళంగా మారింది. ఈ సమయాన్నే తన రాజకీయ రంగ ప్రవేశానికి వేదిక చేసుకోవాలని భాను నిర్ణయించుకుందని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తేలింది.
అయితే గతంలో పలు విషయాల్లో మీడియాకెక్కిన భాను ఒక దశలో అవసరమైన సమయంలో రాజకీయ రంగంలోకి వస్తానని ఇదివరకే చెప్పింది. దీంతో ప్రస్తుతం వివిధ పార్టీలు ఆమెను తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నాయట. అయితే ఈ విషయంలో మాత్రం ఆమె ఆచితూచి అడుగేయాలని నిర్ణయించుకుందట. తన సొంత జిల్లా కరీంనగర్ లేదా హైదరాబాద్ నుంచి పోటీ చేయడానికి భాను ఆసక్తి కనపరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో భాను నోరు విప్పితే గానీ ఆమె అభిమానుల ఉత్కంఠకు పుల్స్టాఫ్ పడదు అంటున్నారు. మరి ఈ విషయమై కూడా ఉదయభాను ఓ మాట చెప్పితే బాగుంటుంది.