Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Vadinamma : జనార్దన్ కొంప ముంచిన లింగం ఆత్రం.. ఆ సెల్ఫీతో కిడ్నాప్ డ్రామా బట్టబయలు.. ఏసీపీ ఎంట్రీతో షాక్!
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 727వ ఎపిసోడ్ కి చేరింది. రఘురాం తన కొడుకు రిషి దగ్గరకు వెళుతూ ఉండడంతో శైలు గొడవ చేసి బాబుని, భర్తను తీసుకొని తన పుట్టింటికి వెళుతుంది. తర్వాత రిషి పుట్టిన రోజు అత్తారింట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం, దానికి రఘు రామ్, సీతలు హాజరైన సంగతి తెలిసిందే. దుర్గ, పార్వతి కలిసి వంట వాళ్ళు రఘురాం, సీత అని శైలుకు చెప్పడానికి ప్రయత్నించి ఎట్టకేలకు ఆ విషయాన్ని శైలు చెవిన పడేస్తారు. దీంతో రగిలిపోయిన శైలు తండ్రి దగ్గరకు వెళ్లి విషయం చెబుతుంది.
అయితే ఇందులో అల్లుడి హ్యాండ్ కూడా ఉందని నిరూపించిన రాజేంద్ర కుమార్తెను తన వైపు తిప్పుకుంటాడు. ప్లాన్ ప్రకారం రిషిని దాచేసి కిడ్నాప్ డ్రామా ఆడతాడు. అదే సమయానికి రఘురాం వ్యాపారం మీద పూణే వెళతాడు, దీంతో అతనే తీసుకువెళ్లాడు అని అభాండాలు వేస్తారు. భరత్ అరెస్టయి పోలీస్ స్టేషన్ లో ఉండగా సీతా పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది.ఆ తరువాత స్టేషన్ కు వెళ్లడం. అవమానించ బోయిన సమయంలో ఏసీపీ ఎంట్రీ ఆసక్తికరంగా సాగింది.
పరిస్థితి చేయి దాటితే మాత్రం
ఇక అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. ఈ రోజు ఎపిసోడ్ లో జరిగిన విశేషాలను చూద్దాం. పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా సీత తన తోటి కోడలు శైలు ఇంటికి బయలుదేరి వస్తుంది. ఆమె వెంట ఆమె అన్న భాస్కర్ కూడా వస్తాడు. నేను వద్దు అని చెబుతున్నా నువ్వు నా వెంట వస్తున్నావు, , ఏం జరిగినా, వాళ్లు ఎన్ని మాటలు అన్నా నువ్వు అసలు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని ముందే చెబుతుంది. సరే వాళ్ళు నిన్ను ఏమన్నా నేను మాట్లాడను కానీ పరిస్థితి చేయి దాటితే మాత్రం చూస్తూ ఊరుకోమని భాస్కర్ చెబుతాడు.
ముందు జాగ్రత్త గా
సీత ఇంట్లోకి రావడం చూసి జనార్ధన్ అసలు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? అన్నట్లు ప్రశ్నిస్తాడు.. అది అడగడానికి నువ్వు ఎవరు నేను వచ్చింది నా తోటి కోడలు ఇంటికి ఇది నా తోటి కోడలు పుట్టిన ఇల్లు అంటే నాకు కూడా పుట్టినిల్లే అని సీత చెబుతుంది.. సీతా భాస్కర్ రావడం చూసి ముందు జాగ్రత్త చర్యగా లింగం ఋషిని తీసుకెళ్లి వేరే గదిలో దాచి వస్తాడు. అయితే ఎలాంటి టెన్షన్ లేకపోవడంతో వీడియోలు చూసుకుంటూ అన్నం తింటున్న శైలు సీత వచ్చిన సంగతి తెలుసుకుని అప్పటికప్పుడు నాటకం మళ్ళీ మొదలు పెడుతుంది..
గదిలోకి వెళ్లి నిద్రపోతునట్లు నటిస్తూ ఉండగా సీత లోపలికి వెళ్లి మీ బావగారు రఘురాం బాబు ని తీసుకుని వెళ్ళలేదు ఆయన వెళ్లి అంతవరకు నేను అక్కడే ఉన్నాను, అందరూ ఏదో అనుకుంటున్నారు నువ్వు మాత్రం ఒక నిర్ణయానికి రావద్దు అని చెబుతుంది.. అలా మాట్లాడిన తర్వాత సీత ఇంటికి బయలుదేరి వెళ్ళింది.
రిషి ఈ ఇంట్లోనే ఉన్నాడని
అలా వెళ్తున్న సమయంలో సీతకు ఎందుకో గానీ రిషి ఈ ఇంట్లోనే ఉన్నాడు అనిపిస్తుంది..భాస్కర్ అన్నయ్యకు చెబితే ఇప్పుడు రచ్చ చేస్తాడు అని భయపడి ఆ విషయం చెప్పకుండా ఇంటికి వెళ్తుంది. ఇక రఘురాం అప్పుడే పని పూర్తి చేసుకుని రూమ్ కి వచ్చి కాస్త రిలాక్స్ అవుతాడు. అప్పుడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన విషయం తెలుసుకుని వెంటనే ఛార్జింగ్ పెడతాడు. అలా సీత ఇంటికి వెళ్ళిన తర్వాత రఘురాం ఫోన్ చేస్తాడు.. రఘురాం కి విషయం అంతా చెప్పి త్వరగా బయల్దేరి రమ్మని అడుగుతుంది. నేను వెంటనే నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు ఉంటే అప్పుడు బయలుదేరి వస్తాను అని రఘు అని చెబుతాడు.
ఎవరికి చూపించాలో వాళ్లకి చూపిస్తే
మరోపక్క భాస్కర్ కి టిఫిన్ ఇచ్చిన దుర్గ ఫేస్బుక్ వెతుకుతుండగా అనుకోకుండా రిషితో లింగం దిగిన సెల్ఫీ కనబడుతుంది. వెంటనే ఈ విషయాన్ని పార్వతికి చెప్పాలని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విషయం పార్వతి కి చెప్పి దీని ద్వారా మనం మరింత గొడవ పెట్టాలి అని అంటుంది.. అయితే ఇది పోలీస్ స్టేషన్ లో చూపించి నా అల్లుడుని విడిపించుకుని వద్దామంటే, కాదు ఇది ఎవరికి చూపించాలో వాళ్లకి చూపిస్తే మనకింకా ఉపయోగం ఉంటుంది అని చెబుతోంది.
కమింగ్ అప్ లో
జనార్ధన్ కావాలని బాబు ని కిడ్నాప్ చేయించి లింగంతో సైలెంట్ గా దాచాడు అని ఇద్దరూ ఫిక్స్ అవుతారు. అయితే ఈ విషయం ఎవరికి చెప్పారు అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ మాత్రం రావడం లేదు. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించగా తరువాతి ఎపిసోడ్ లో కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం సీత అనుమానంతో ఏసిపి సెర్చ్ వారెంట్ తీసుకుని జనార్దన్ ఇంటికి వెతికేందుకు వచ్చినట్లు చూపించారు. అయితే బాబు లోపల ఉండడంతో శైలు సహా జనార్ధన్ కూడా వణికిపోతూ కనిపించారు చూడాలి తర్వాత ఏం జరగబోతోంది.