twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vadinamma : దిమ్మతిరిగే ప్లాన్ వేసిన రాజేశ్వరి.. దుర్గకు విషయం లీక్ చేసిన రఘురాం..శైలు సూసైడ్ అటెంప్ట్!

    |

    స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 715 వ ఎపిసోడ్ కి చేరింది. రఘురాం మాట మాట్లాడితే తన కొడుకు రిషి దగ్గరకు వెళుతూ ఉండడంతో శైలు గొడవ చేసి బాబుని, భర్తను తీసుకొని తన పుట్టింటికి వెళుతుంది. రఘురాం అక్కడికి కూడా వెళ్లి బాబు పడిపోతుంటే కాపాడటానికి ప్రయత్నిస్తే తప్పుగా అర్థం చేసుకుని రఘురామ్ ను దొంగగా భావించి ఇంట్లో అందరూ చితక బాదారు. రఘురాం ఇక్కడ కూడా వదలడం లేదు అనే ఉద్దేశంతో నేను అసలు మీ ఇంటికి రాను అన్నట్లు శైలు మాట్లాడుతుంది.

    తర్వాత రిషి పుట్టిన రోజు అత్తారింట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసినట్లు చెబుతూ రఘురాం, సీతను పిలవడం లేదని చెబుతారు లక్ష్మణ్. ఎలా అయినా అక్కడికి వెళ్లాలని ఉద్దేశంతో భరత్ సాయంతో రఘురాం సీత ముసలి వాళ్ళ వేషం వేసుకుని అక్కడికి వెళతారు. అక్కడ వంట వాళ్ళ వేషములో సెట్ అవ్వడమే కాక వంట కూడా చేసి మెప్పు పొందుతారు. అలా గత ఎపిసోడ్ ముగించగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    Photos Courtesy: Star MAA and Disney+Hotstar

    రఘురాం, సీతలు ఎలా ఉంటారు అంటే?

    రఘురాం, సీతలు ఎలా ఉంటారు అంటే?

    రఘురాం సీత ఎలా అయినా పుట్టినరోజు ఫంక్షన్ కి వస్తారు అని అనుమానం పడుతున్న జనార్ధన్ వాళ్లు కనుక వస్తే నీ తల తీసేస్తాను అని బావమరిదికి వార్నింగ్ ఇస్తాడు. అంతేకాక కొత్తగా ఇంట్లోకి బయట నుంచి వచ్చింది వంట వాళ్ళు కనుక వంట వాళ్లకు అసిస్టెంట్గా పని చేస్తామని చెబుతూ వాళ్ళు లోపలికి రావచ్చ అనే ఉద్దేశంతో వాళ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడదామని అంటాడు. అలా వెళ్లి విషయం చెప్పి ఎవరైనా మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతాను అంటే వాళ్ళను కచ్చితంగా జాయిన్ చేసుకోవద్దు అంటాడు.

    సరే మీరు చెప్పిన రఘురాం సీతలు అసలు వాళ్ళు ఎలా ఉంటారో మాకు తెలియదు కదా వాళ్ళను ఎలా గుర్తుపట్టాలి అని ప్రశ్నిస్తారు.. దానికి జనార్దన్ సమాధానం చెప్పబోతుంటే వెంటనే బావమరిది మధ్యలో అందుకని వాళ్ల గురించి నువ్వు ఎందుకు బావ నేను చెబుతాను అంటాడు.

    దుర్గ చంప పగలగొట్టి

    దుర్గ చంప పగలగొట్టి

    అలా అని చెప్పి సీతా రఘురాం ఇద్దరి గురించి చాలా గొప్పగా వర్ణిస్తూ ఉంటాడు. తన బావమరిది తన శత్రువులు గా భావించే సీతా, రఘురాం గురించి గొప్పగా చెబుతూ ఉండడంతో జనార్ధన్ తట్టుకోలేక పోయాడు.. వెంటనే తీవ్రస్థాయిలో ఫైర్ అవుతూ ఇక వాళ్ళ భజన చేసింది చాలు ఇక ఆపండి అంటాడు. మరో పక్క సీత రఘురాం కి ఏం చెప్పింది అనే విషయం తెలుసుకోవడానికి పార్వతి, దుర్గ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

    పార్వతి ప్రయత్నం చేసి విఫలం కాక ఇప్పుడు దుర్గ వచ్చింది.. అక్కడ కూర్చుని బాధపడుతున్న రాజేశ్వరి దగ్గరకు వెళ్లి దుర్గా అనేక మాటలు అంటుంది. పలు విధాలుగా ప్రయత్నించి తర్వాత సీతను ఏదో అనబోతున్న క్రమంలో రాజేశ్వరి దుర్గ చంప పగలగొడుతుంది..

    పగిలిన చంప తో

    పగిలిన చంప తో

    వెంటనే పగిలిన చంప తో దుర్గా సైలెంట్ గా కూర్చుంటుంది. పార్వతి వచ్చి అడిగితే జరిగిన విషయం చెప్పి ఈ విషయం ఎవరికీ బయటకు లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని మాట తీసుకుంటుంది. ఇక మరో పక్క బాబు కేక్ కటింగ్ వరకు ఉండకుండా వెళ్లిపోవాలి అనే సీత భావిస్తుంది. అప్పటివరకు ఉంటే కచ్చితంగా ఏదో ఒకటి జరుగుద్ది, అని ఇప్పటివరకు ఉన్న ఆనందం అంతా ఆవిరి అవుతుందని ఆమె భావిస్తుంది.

    అయితే రఘురాం మాత్రం లక్ష్మణ్ మాట తీసేసి మనం వెళ్లిపోలేము కదా అంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా కేక్ కటింగ్ చేసే సమయం రానే వచ్చింది. కేక్ కటింగ్ చేయించిన తర్వాత ముందుగా దీవించాలని తల్లిదండ్రులని కోరతారు.

    రాజేశ్వరి అద్భుతమైన ప్లాన్

    రాజేశ్వరి అద్భుతమైన ప్లాన్

    అయితే తల్లిదండ్రుల చేత దీవించాలని భావించిన రాజేశ్వరి అనుకోకుండా ఒక అద్భుతమైన ప్లాన్ చేస్తోంది. ఇక్కడ ఉన్న వారందరిలో పెద్ద జంట ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ముందుగా బాబుని దీవింప చేస్తే బాబుకి చాలా మంచి జరుగుతుందని అంటుంది. ఆమె లెక్క ప్రకారం వంటవాళ్ళు రూపంలో వచ్చిన రఘురాం సీత లు ముందుగా బాబుని దీవించాలని. ఆ విషయం గా ఇంట్లో అందరూ కూడా ఏకీభవిస్తారు. పంతులు కూడా అదే నిజమైన శాస్త్రీయ పద్ధతి అని ఒప్పుకుంటాడు. దీంతో వాళ్ళిద్దరినీ లోపలికి తీసుకు రావాలని లక్ష్మణ్ సిరిని పంపుతాడు.

    Recommended Video

    Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
    శైలు సూసైడ్ ప్లాన్

    శైలు సూసైడ్ ప్లాన్

    ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం ఫంక్షన్ అంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి అయినట్లుగా చూపిస్తున్నారు. అయితే సీత రఘురాం కి చెప్పిన నిజం ఏమిటి అని తెలుసుకోవడానికి దుర్గ రఘురాం షాప్ కి వెళ్లినట్లు చూపించారు.

    అయితే చెల్లెలు అడిగితే ఏదైనా నిజమే చెబుతాను ఏం కావాలి అని దుర్గను అడిగితే దుర్గ ఈ విషయం అడుగుతుంది. వెంటనే రఘురాం రిషి మా కొడుకే అని నాకు చెప్పింది అనే విషయం చెప్పడంతో ఆమె ఆ విషయాన్ని పార్వతికి చేరవేయడం పార్వతి జనార్దన్ కు చేరవేయడం జనార్దన్ ద్వారా శైలు చెవిన పడటంతో ఆమె తుపాకి తీసుకుని చనిపోవడానికి సిద్ధమైనట్లు చూపిస్తున్నారు. మొత్తం మీద ఆసక్తికరంగా సాగే విధంగా కనిపిస్తోంది.

    English summary
    Vadinamma Episode 715: Siri decides to teach Parvati and Durga a lesson. Later, Shailu gets suspicious when Rishi calms down after meeting Pedhamma.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X