Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Vadinamma : తప్పు తెలుసుకున్న శైలు.. రఘురాం, సీతల బండారం లీక్ చేసిన దుర్గ, పార్వతి!
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 716 వ ఎపిసోడ్ కి చేరింది. రఘురాం మాట మాట్లాడితే తన కొడుకు రిషి దగ్గరకు వెళుతూ ఉండడంతో శైలు గొడవ చేసి బాబుని, భర్తను తీసుకొని తన పుట్టింటికి వెళుతుంది. రఘురాం అక్కడికి కూడా వెళ్లి బాబు పడిపోతుంటే కాపాడటానికి ప్రయత్నిస్తే తప్పుగా అర్థం చేసుకుని రఘురామ్ ను దొంగగా భావించి ఇంట్లో అందరూ చితక బాదారు. రఘురాం ఇక్కడ కూడా వదలడం లేదు అనే ఉద్దేశంతో నేను అసలు మీ ఇంటికి రాను అన్నట్లు శైలు మాట్లాడుతుంది. తర్వాత రిషి పుట్టిన రోజు అత్తారింట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసినట్లు చెబుతూ రఘురాం, సీతను పిలవడం లేదని చెబుతారు లక్ష్మణ్. ఎలా అయినా అక్కడికి వెళ్లాలని ఉద్దేశంతో భరత్ సాయంతో రఘురాం సీత ముసలి వాళ్ళ వేషం వేసుకుని అక్కడికి వెళతారు. అక్కడ వంట వాళ్ళ వేషంలో సెట్ అవ్వడమే కాక వంట కూడా చేసి మెప్పు పొందారు. అంతేకాక లక్ష్మణ్ కు కూడా వాళ్ళు రావడం తెలియడంతో ఆనందంగా ఉంటాడు. రాజేశ్వరి ప్లాన్ తో అందరికంటే ముందు వాళ్ళ మీద అక్షింతలు కూడా పడతాయి. ఇక అలా గత ఎపిసోడ్ ముగించగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్
ఇంటికి చేరిన శైలు
ముసలి వాళ్ళ వేషధారణలో శైలు పుట్టింటికి వెళ్లి అక్కడ అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత రఘు రామ్, సీత సహ కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఉంటారు. రఘు రామ్, భరత్ ఇద్దరూ కూడా షాప్ కి వెళ్లడానికి రెడీ అవుతున్న సమయంలోనే లక్ష్మణ్ తన భార్యను తీసుకుని ఇంటికి వస్తాడు.. అయితే వాడు లోపలికి రాకుండా గుమ్మం దగ్గర నిలిచిపోయిన చూస్తూ ఉంటారు. తప్పు చేశాను అనే భావనలో ఉన్న శైలు లోపలికి అడుగు పెట్టడానికి కూడా సంశయిస్తూ ఉంటుంది సీత కల్పించుకుని ఏమిటి అక్కడే ఆగిపోయారు లోపలికి రండి అని పిలుస్తుంది.
రఘురాం చేతికి
ఆ విధంగా లోపలికి వచ్చిన శైలు రావడం రావడమే తన కొడుకుని తీసుకుని వెళ్ళి రఘురాం చేతికి ఇస్తుంది.. రఘు రామ్, సీత ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా వాడిని ఆశీర్వదించాలి అని చెబుతూ అక్షింతలు తీసుకురావాలి అని చెప్పి సిరిని కోరుతుంది. అలా లోపలికి అక్షింతల కోసం వెళ్లిన సిరి బయటకు వచ్చేలోపు నా బాధను వ్యక్తం చేస్తుంది శైలు. మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ కి మిమ్మల్ని పిలవకపోవడం చాలా పెద్ద తప్పు కానీ మీరు అది ఏది మనసులో ఉంచుకోకుండా నన్ను మళ్ళీ మామూలు మనిషిలాగా చూస్తున్నారు అంటే అక్కడే మీ మీ గొప్పతనం ఏమిటో అర్థం అవుతుంది కానీ నేను మిమ్మల్ని పిలవ లేదు అని తన బాధను వ్యక్తం చేస్తుంది.
రఘురామ్ నే అడగడానికి
అయితే నిజమేమిటో ఇప్పటికైనా తెలుసుకున్నావు అని ఇంట్లో వాళ్ళందరూ ఆమెను అభినందిస్తారు..బాబు తో ఆడుకోమని చెప్పి రఘురామ్, సితలకి అప్పగించి శైలు, లక్ష్మణ్ లోపలికి వెళ్తారు. అయితే నువ్వు షాప్ కి వెళ్ళాలి కదా వెళ్ళు అని సీత రఘురాం ను తొందర పెడుతుంది. దీంతో రఘురాం భరత్ ఇద్దరూ కలిసి షాప్ కి వెళ్లారు. అయితే రఘురాం కి సీత ఏం చెప్పి బతికించు ఉంది అనే విషయాన్ని ఎలా అయినా తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ దుర్గ ఇక ఏం చేయాలో తెలియక రఘురామ్ నే అడగడానికి ఫిక్స్ అవుతుంది. వెంటనే ఇంట్లో సరుకులుకొనే వంకతో రఘురామ్ షాప్ కి వెళ్తుంది దుర్గ.
నిజం చెప్పేసిన రఘురాం
అక్కడ రఘురాం గుర్తించి లోపలికి తీసుకువెళ్ళి కూర్చో పెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత నిన్ను ఒక విషయం అడుగుతాను చెప్తావా అంటే అడగమని అంటాడు. నీకు ఏమైంది, సీత ఏం చెబితే నువ్వు లేచి కూర్చున్నావో, చెబితే రేపొద్దున మా ఆయనకు ఏమైనా జరిగితే నేను కూడా అదే పద్ధతి ఫాలో అవుతాను అని వస్తుంది. అయితే రఘురాం ఆశ్చర్యకరంగా అసలు జరిగిన విషయం అంత వివరంగా వెల్లడిస్తాడు. మా శైలు కొడుకు చనిపోవడంతో, మా సొంత కొడుకైన రిషి తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టినట్టు ఇలా నిజం చెప్పేసిన తర్వాత ఆమె మాత్రం దానిని నమ్మడానికి సిద్ధంగా ఉండదు.. కావాలని నాకు ఇదంతా కట్టుకథ చెబుతున్నారు అని అని ఫీల్ అవుతుంది.
కమింగ్ అప్ ప్రకారం
ఆమె మనస్సు మాత్రం ఇందులో ఏదో మర్మం ఉంది అని మాత్రం చెబుతూ ఉంటుంది ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు. తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం సీత విషయంలో ఏదో తెలుసుకున్న దుర్గ పార్వతి దగ్గరికి వెళ్లి చేరవేస్తుంది. ఆలా పార్వతి, దుర్గ ఇద్దరూ కలిసి వెళ్లి శైలు గుడికి వచ్చిన మీ ఇంట్లో వంట చేయడానికి వచ్చింది ఎవరో కాదు అని చెబుతూ కొన్ని ఫోటోలు చూపిస్తున్నారు.. ఆ ఫోటోలలో రఘురాం, సీత ఉండే అవకాశం ఉంది. అది చూసిన వెంటనే శైలు ముఖ కవళికలు మారిపోయినట్లు చూపిస్తున్నారు. దీంతో తర్వాత మరింత ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.