twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vadinamma : శైలు దెబ్బకు నూతిలో పడ్డ లింగం.. జాతరలో దెబ్బకొట్టేందుకు మరో ప్లాన్?

    |

    ఆలయంలో ఇచ్చే విరాళం కోసం 2 టీములుగా విడిపోయిన రఘురాం కుటుంబం కష్టపడుతున్న సంగతి తెలిసిందే. అయితే మనం చేసే రోజువారీ కూలి పనులతో రెండు లక్షల రూపాయలు సంపాదించడం కష్టమా అని చెప్పిన సీత ఇప్పటివరకు కూడబెట్టిన డబ్బుతో పిండివంటలు చేసి శివరాత్రి ఉత్సవాలలో స్టాల్ పెట్టి అమ్మితే రెండు లక్షలు సంపాదించవచ్చు అని ఐడియా చెబుతుంది. ఈ ఐడియా విని లింగం విషయం అంతా శైలుకి చెబుతాడు. అప్పటికప్పుడు ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఉద్దేశంతో కష్ట పడుతూ ఉండగా లింగం పొరపాటున ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న ల్యాప్టాప్ మీద నీళ్ళు గుమ్మరిస్తాడు.

    అయితే లక్ష్మణ్ కి తెలిస్తే ఆయనని కొడతాడు ఏమో అనే ఉద్దేశంతో శైలు తన చేతిలో వాటర్ పడిపోయాయని చెబుతుంది. అప్పటికప్పుడు ప్రాజెక్టు సిద్ధం చేయడం కుదరదు కాబట్టి మనం సంపాదించ లేకపోయినా వాళ్లు కూడా సంపాదించుకున్న చేయాలి అని శైలు ఫిక్స్ అవుతుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    మరింత సీరియస్

    మరింత సీరియస్

    రిషి ఆడుకుంటూ ఉండగా పిండి వంటలు వాసన తగలడంతో అవేమిటో చూద్దామా అని రఘురాం సీత పిండి వంటలు చేస్తున్న వైపు నడుచుకుంటూ వెళతాడు. బాబు అక్కడికి వెళ్లడంతో వాడి చేత కొన్ని సీట్లు తెప్పించుకుని తింటూ ఉంటారు. అది చూసిన శైలు కోపంతో వచ్చి అక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే రిషి అటువైపు స్వీట్ తీసుకొచ్చి ఇచ్చాడు.

    నాకైతే తినడం ఇష్టం లేదు కానీ బాబు అంత ప్రేమగా ఇస్తే తినకుండా వదిలివేయడం బాగుండదు అని పెడుతున్నాను అని అబద్ధం చెబుతాడు. బాబు అటువైపు ఎందుకు వెళ్ళాడు అని చూడటానికి వెళ్లిన శైలుకి బాబు రఘురాం ఒడిలో కూర్చుని ఆడుకోవడం కనిపిస్తూ ఉంటుంది. దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అనుమాన పడి శైలు ఈ పరిణామాలతో మరింత సీరియస్ అవుతుంది.

    పందెం నుంచి ఓడిపోయి

    పందెం నుంచి ఓడిపోయి

    తాను అటు వెళ్లకుండా లింగాన్ని బాబుని తీసుకురమ్మని పురమాయించింది. కానీ లింగం వెళుతుంటే భరత్ భయపెడతాడు నువ్వు వస్తే కానీ పని పడతాను అనే విధంగా మాట్లాడటంతో రావడానికి కాస్త వెనకాడతారు కానీ శైలు కోపం చూసి బాబును తీసుకురావడం కోసం వెళ్ళాడు. బాబు ని తీసుకుని శైలుకి ఇచ్చేసి పైకి వెళ్ళేందుకు సిద్ధమవుతారు.

    పిండివంటలు సిద్ధమైన తర్వాత వాటన్నింటినీ ఒక చోట చేర్చి రేపు ఉదయాన్నే జాతరకు తీసుకువెళ్లాలని సీత అండ్ కో భావిస్తారు. ఆ విధంగా భావించిన తరువాత వారు నిద్రకు ఉపక్రమిస్తారు. ఇదే అదునుగా భావించిన శైలు ఎలా అయినా లింగం చేత ఆ పిండి వంటలు అన్నింటిని చెడగొట్టేస్తే వాళ్లు కూడా పందెం నుంచి ఓడిపోతారు కదా అనే ఆలోచన చేస్తుంది.

    బావిలో పడ్డ లింగం

    బావిలో పడ్డ లింగం

    అలా ఆలోచించి వాటి మీద నీళ్లు పోయమని లింగంకి పని అప్పజెబుతుంది. అందరూ నిద్ర పోయిన తరువాత ఆ పని చేసేందుకు సిద్ధం అయిన లింగం నీళ్లు లేవు అనే విషయం అర్థం చేసుకుంటాడు. బావి దగ్గరకు వెళ్ళి నీళ్ళు తోడే ప్రయత్నం చేస్తూ ఉండగా అనుకోని పరిస్థితుల్లో బావిలో పడతాడు. అరుద్దాము అంటే ఎందుకు నీటి దగ్గరకి వచ్చావు అని అడుగుతారు అనే భయంతో సైలెంట్ గా బావిలోనే ఉండిపోతాడు. తెల్లవారింది కానీ ఎవరూ ఎలాంటి హాహాకారాలు చేయక పోవడంతో ఏమీ జరగలేదు అనే విషయం అర్థం చేసుకున్న శైలు అసలు మావయ్య ఎక్కడికి వెళ్ళాడు అని వెతుకుతూ బయటకు వస్తుంది. ఏదైతే అదే జరిగింది తనని తాను కాపాడుకోవాలి అని గట్టిగా అరుస్తాడు.

    వెనక్కి వెళ్లేలా చేసి

    వెనక్కి వెళ్లేలా చేసి

    లింగం బావిలో పడ్డాడు అన్న సంగతి అర్థం చేసుకున్న శైలు బయటకు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒక సారి సిరి రావడంతో కాస్త ప్రేమగా నటించి ఆమెను వెనక్కి వెళ్లేలా చేసింది. ఆ తర్వాత శిల్ప వచ్చినా ఆమెకు విషయం చెప్పకుండా దానిని పైకి లాగే ప్రయత్నం చేస్తుంది. మధ్యలో మనిషిని చూసి ఆమె కూడా మళ్ళీ వదిలేస్తుంది.

    ఈసారి వదిలేస్తే నన్ను కాదు నా శవాన్ని పైకి తీస్తారు అని అంటూ లింగం బతిమాలాడాడు. దీంతో అతని పైకి లాగి ఇంటికి వెళ్లి నాన్నతో కలిసి జాతరకు రమ్మని పంపిస్తుంది శైలు. జాతరలో సీట్లు పిండివంటలు అమ్మే చోట దెబ్బకొట్టాలని భావిస్తూ ఎలా అయినా లక్ష్మణ్ ని జాతరకు తీసుకువెళ్లాలని భావిస్తుంది. శైలు చేస్తున్న అన్ని పనులకు అండగా నిలుస్తున్న రాజేశ్వరి ఈ పనికి కూడా అండగా నిలుస్తూ కచ్చితంగా జాతరకు వెళ్లాల్సిందే అని చెబుతుంది.

     పందెం ఎలా

    పందెం ఎలా

    ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగించారు తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం జాతర లో రఘురాం షాప్ కి మంచి క్రేజ్ రావడం అందరూ వాళ్ళ దగ్గర సరుకులు కొనడం చూసి జనార్ధన్ లింగం కలిసి ఒక మనిషిని అక్కడికి పంపించి ఈ పిండి పదార్థాలు తిన్న తర్వాత అనారోగ్యం పాలు అయినట్టు నాటకం ఆడిస్తారు. దీంతో రఘురాం షాప్ లో ఉన్న వారందరూ సరుకులు తీసుకో వచ్చి మళ్ళీ ఇచ్చేసి డబ్బులు తీసుకుంటారు. మరి ఈ ఫ్యామిలీ ఎలా పందెం గెలుస్తుంది అనేది చూడాల్సి ఉంది.

    English summary
    Vadinamma Episode 785: Shailu gets upset as Lingam fails to carry out his plan. Elsewhere, Rajeshwari praises Sahilu's efforts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X