Don't Miss!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
Vadinamma : పాల కోసం గొడవ.. భరత్ మీద లక్ష్మణ్ దాడి.. ఏమైందంటే?
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 747 వ ఎపిసోడ్ కు చేరింది. ముందు నుంచి ఉమ్మడి కుటుంబం చాలా ఆనందంగా గడుపుతున్నా, వారి మధ్య ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భరత్, లక్ష్మణ్ మధ్య గొడవ జరగగా లక్ష్మణ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతాడు. లక్ష్మణ్ దుండగుల చేతిలో దాడికి గురి అవ్వడం, హాస్పిటల్ కి వెళ్లి వచ్చిన తర్వాత లక్ష్మణ్ కారణంగా భరత్, జనార్దన్ మధ్య గొడవ జరగడంతో గొడవ మరింత ముదురుతుంది. లక్ష్మణ్ కాళ్ళ మీద భరత్ పడి తనను క్షమించమని అడగడంతో ఇంట్లోనే ఉండాలని లక్ష్మణ్ భావిస్తాడు.
అయితే జనార్దన్ అరెస్ట్ విషయంలో భరత్ హ్యాండ్ ఉందని తెలియడంతో లక్ష్మణ్, శైలు ఇల్లు వదిలి వెళుతుంటే వారిని ఆపేందుకు వెళ్లి రాజేశ్వరి కిందపడి గాయాలపాలవుతుంది. ఇక ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేస్తే తాను చనిపోతానని ఆమె అంటూ ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని సీత మాట ఇస్తుంది. కానీ ఇంటికి వచ్చాక పరిస్థితులు మాత్రం ఇబ్బందికరంగా మారతాయి. అక్కడితో 746 వ ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ రోజు జరుగుతున్న ఎపిసోడ్ లో ఎలాంటి విశేషాలు జరిగాయి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కలిసి ఉండే ప్రసక్తే లేదు
హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సీత ఇంట్లో కుటుంబ సభ్యులు అందరినీ హాజరు పరిచి మీ అమ్మగారి ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదు మీ అందరూ కలిసి ఉంటారు అని నేను ఆమెకు మాట ఇచ్చాను, ఆమెను డిశ్చార్జ్ చేసి తీసుకు వచ్చే సమయానికి ఇంట్లో ఎవరూ లేక పోయినా ఆమె మళ్లీ బాధ పడుతుంది దయ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని ఎవరు ఉద్దేశాలు పెట్టుకోవద్దు అని పడుతుంది.
అయితే భరత్ ఇంట్లో నుంచి వెళ్లిపోతే తాను ఇంట్లో ఉంటాను అని చెబుతున్న లక్ష్మణ్ మాత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అనే విధంగా మాట్లాడుతాడు. నేను అమ్మకు ఇంట్లోనే ఉంటాను అని మాట ఇచ్చారు కానీ భరత్ ఉన్న ఇంట్లో నేను కలిసి ఉండే ప్రసక్తే లేదు అని చెబుతాడు.
ఆరోగ్యం పేరు చెప్పి
చాలా సేపు బతిమాలడం తర్వాత సీత సంయమనం కోల్పోయి ఇక మీరిద్దరూ కలిసి ఉంటారనే నమ్మకం నాకు పోయింది. కానీ ఒక్క పని చేయండి దయచేసి మీ అమ్మ ఆరోగ్యం కుదుట పడే వరకు ఇద్దరు ఇంట్లోనే ఉండండి అని అడుగుతుంది. దానికి భరత్ మాట్లాడుతూ వదినమ్మ నాకు జీవితాంతం ఇక్కడే ఉండాలని కూడా ఆశగా ఉంది నా నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు అని అంటారు. లక్ష్మణ్ ఏం మాట్లాడాలో తెలియక ఆలోచించు కుంటున్న సమయంలో అనూహ్యంగా శైలు మాట్లాడుతూ వీళ్ళు మీ అమ్మగారి ఆరోగ్యం పేరు చెప్పి మనల్ని ఇక్కడే ఉంచాలని చూస్తున్నారు అంటుంది.
ఉండడం ఇష్టం లేదు
అయితే సీత మాట్లాడుతూ మీరు పర్మనెంటుగా ఇక్కడ ఉండి పోవాలి అని నేను కోరుకోవడం లేదు దయచేసి ఆమె ఆరోగ్యం కుదుట పడే వరకు ఉండి ఆ తర్వాత సమయం చూసుకుని నేనే ఆవిడకు అన్ని పరిస్థితులు వివరంగా చెప్పి మీరు వెళ్లిపోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాము అని అంటుంది. అయితే సీత చెబుతున్న మాటలు ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా మాట్లాడుతుంది. మీరు కొద్ది రోజులు అంటే జీవితాంతం మమ్మల్ని వదిలేటట్టు కనబడడం లేదు మాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అన్నట్లుగా శైలు మాట్లాడుతుంది. అయితే చివరికి లక్ష్మణ్ తన అన్నకు మాట ఇవ్వడంతో ఎవరికి వాళ్ళు తమ తమ గదుల్లోకి వెళ్లిపోతారు.
రాజేశ్వరి డిశ్చార్జ్
ఆ తర్వాత భరత్ ని ఇంటి నుంచి వెళ్ళిపొమ్మని చెబుతావు ఏమిటి మనం మా అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోదాం అని నేను అంటుంటే అని శైలు ప్రశ్నిస్తుంది. దానికి లక్ష్మణ్ మాట్లాడుతూ నేను మా అమ్మకు ఈ ఇంట్లోనే ఉంటాను అని మాట ఇచ్చాను అందుకే భరత్ ఇంటి నుంచి వెళ్లిపోవాలని నేను చెబుతున్నాను అంటాడు. మాకు ఇదంతా వర్కౌట్ అయ్యేటట్టు కనబడడం లేదు మా అమ్మ నాన్న ఇంటికి వెళితే మనం ప్రశాంతంగా జీవితం గడపవచ్చు, నేను అనుకుంటే నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అని శైలు అడుగుతుంది. లేదు నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఏం చేయాలో నేను చెబుతాను అని భార్యతో అంటాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా మరో పక్క సీత రాజేశ్వరి ని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకు వస్తుంది.
పాల గ్లాసు తీసుకుని
ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత ఆమె ఇంట్లో అందరినీ పలకరిస్తుంది. చివరిగా సీత మనసులో ఏదో ఇబ్బంది పడుతున్న విషయం గ్రహించి ఆమె సీతతో కాసేపు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుతుంది. వాళ్ళిద్దరూ నా కడుపున పుట్టిన బిడ్డలు వాళ్ళిద్దరూ బయట వాళ్ళ కోసం వారిలో వాళ్ళు కొట్టుకుంటున్నారు అనే విషయం వారికి అర్థమయ్యేలా చెబితే కచ్చితంగా వాళ్ళు మారతారని నమ్మకం నాకు ఉంది అని ఆమె అంటుంది. ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు.
తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం, శైలు తన బాబు కోసం పాలు సిద్ధం చేయడానికి వాటిని పొయ్యిమీద పెడుతుంది అయితే అనుకోకుండా సిరి అదే పాలు తీసుకు వెళ్లి భరత్ తాగడం కోసం ఇస్తుంది. ఈ విషయాన్ని తీసుకుని వెళ్లి లక్ష్మణ్ కి శైలు ఎక్కించడంతో లక్ష్మణ్ ఆవేశంగా వచ్చి భరత్ తాగుతున్న పాల గ్లాసు తీసుకుని విసిరేస్తాడు. దీంతో తదుపరి ఎపిసోడ్ ఆసక్తికరంగా కనిపిస్తోంది.