Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Vadinamma Serial July 24 Episode: నాని-శిల్పలకి శోభనం గండం.. దమంయంతికి మరో ఛాన్స్?
ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్న వదినమ్మ సీరియల్ తాజా ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా సాగింది. అనేక మలుపులు అనంతరం పెళ్లి చేసుకున్న శిల్పా నాని శోభనానికి సిద్ధమవుతున్నారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది చూద్దాం.
Photos Courtesy: Star MAA and Disney+Hotstar
నిన్న ఏమైందంటే?
నిన్నటి ఎపిసోడ్ లో శిల్పా నాని ఇద్దరు జంటగా ఇంటికి వస్తారు. ఇంట్లోని అందరూ వారిద్దరినీ సాదరంగా ఆహ్వానిస్తారు. అయితే ఇప్పుడు రఘురాం కుటుంబం మొత్తం శిల్పా నాని శోభనం ఎప్పుడు జరపాలి అనే విషయం మీద ఫోకస్ పెడతారు. అయితే దాని కోసం సపరేట్గా ముహూర్తాలు పెట్టాలని ఈలోపు వారిద్దరూ కలుసుకోకుండా చూసుకోవాలని కుటుంబం అంతా ఫిక్స్ అవుతారు.
జెడ్ ప్లస్ సెక్యూరిటీ
ఈ నేపథ్యంలోనే రఘురాం ఆ బాధ్యతను తన ఇద్దరూ తమ్ముడు - మరదళ్ళకి అప్పగిస్తాడు.. దీంతో నానిని తీసుకుని లక్ష్మణ్ భారత్ ఇద్దరు నాని గదిలో పడుకుంటారు.. శిల్పని తీసుకుని సిరి శైలు ఒక గదిలో పడుకుంటారు.. అయితే వీరి మధ్య ఉన్న నాని- శిల్ప ఎలా అయినా కలుసుకోవాలని తాపత్రయ పడుతుంటారు. ఎలా అయినా అన్నలని బురుడీ కొట్టించి తన భార్యను కలవాలని నాని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.
ఎలా కలవాలా?
మరోపక్క శిల్ప పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. తన తోటి కోడళ్ళు ఇద్దరూ చెరో పక్కన ఉన్నా మనసు మాత్రం నాని దగ్గరే ఉంటుంది. అయితే రాత్రి గడవాలి కాబట్టి శైలు తన లవ్ స్టోరీ మొత్తం శిల్పకి చెబుతుంది. అయితే వింటున్నట్టు నటిస్తోంది కానీ శిల్ప మనసు అంతా నాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరోపక్క నాని పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంటుంది. ఏం చేయాలా ? ఎలా కలవాలా? అని ఇద్దరూ పరితపిస్తూ ఉంటారు.
కొంగు ముడి
అయితే వీరిద్దరూ ఎలా అయినా కలవకూడదు అని భావించి అటు భరత్, లక్ష్మణ్ మరోపక్క సిరి శైలు ఇద్దరు గట్టిగా ఫిక్స్ అవుతారు. ఏకంగా శైలు అయితే శిల్ప కొంగు తీసుకుని తన చీర కొంగు ముడి వేసుకుంటుంది.. అయితే ఇద్దరు అన్నయ్యలు నిద్రలోకి జారుకున్నారు అన్న సంగతి గ్రహించి నాని నెమ్మదిగా లేచి బయటకు వస్తాడు.. బయటకు రావడమే ఆలస్యం వెంటనే తన భార్య ఉన్న గదికి వెళ్లి చూస్తాడు.
సీత- రఘురామ్ ఎంట్రీ
అక్కడ తన భార్య కూడా సేమ్ పొజిషన్ లో ఉందని తెలుసుకుని నెమ్మదిగా లేచి బయటకు రావాలని హింట్ ఇస్తాడు. దీంతో నెమ్మదిగా లేచి వస్తుంది శిల్ప. ఇక ఇద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటారు. ఇక అలా మైమరచి ఒకటవ బోతున్న సమయంలో సీత- రఘురామ్ ఎంట్రీ ఇస్తారు. అదేంటి రా ఇలా చేస్తున్నరు, వద్దని చెప్పాం కదా అంటే శిల్ప కళ్ళలో నలక పడింది తీస్తున్నానని అబద్దం చెబుతాడు నాని.
కాపలా కాయండిరా అంటే
దీంతో రఘురామ్ కోపంగా కర్ర తీసుకువెళ్లి ఇద్దరు తమ్ముళ్లను వాయిస్తాడు. వాడిని కాపలా కాయండిరా అంటే మీరు నిద్రపోతున్నారు అంటూ కాసేపు కామెడీ పండిస్తాడు. ఆ తర్వాత సీత కూడా సరిగ్గా ఇలాగే తన తోటి కోడళ్ళ దగ్గరికి వెళ్లి ఇద్దరూ నిద్రపోతున్నారని ఇంకొంచెం వుంటే అంతా ఈరోజు అయిపోయేది అని అంటుంది. అయితే అదేమీ లేదని శైలు తన లవ్ స్టోరీ చెప్పిందని సిరి అంటుంది. ఇలా జరుగుుండగా నేటి ఎపిసోడ్ ముగించారు.
దమయంతి ఎంట్రీ
ఇక తరువాతి ఎపిసోడ్ లో కొత్త షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక రేపు శోభనం అని భావిస్తూ ఉండగా, పంతులు మాత్రం శోభనం అనేది మూడు రోజుల పండుగ అని ఇప్పుడు మాత్రం ఒకరోజులో అమావాస్య వచ్చేస్తుందని అంటాడు. ఇదేంటి ఇలా అయింది, దమయంతి మళ్లీ ఏదో ఒకటి చేసే లోపు ఈ తంతు ముగిస్తే బాగుండు అని అనుకునేలోపే ఆమె ఎంట్రీ ఇచ్చింది.