Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Vadinamma Serial June 21st Episode: మళ్ళీ కష్టాల సుడిగుండం.. కరెంట్ కూడా లేకుండా రాత్రంతా!
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ రోజుకొక ఆసక్తికరమైన ట్విస్ట్ తో సాగుతోంది. తాజా ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా ప్రేక్షకులందరినీ కట్టిపడేస్తుంది.. ఇక ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో ఏం జరిగింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఉద్యోగాల కోసం రోడ్డెక్కిన లక్ష్మణ్
గత ఎపిసోడ్ లో లక్ష్మణ్ ఉద్యోగాల కోసం రోడ్డెక్కడం, భరత్ అలాగే రఘురాం ఇద్దరూ షాప్ కి వెళ్లడం ఇంట్లో ఆడవాళ్ళూ అందరూ వంట పని మీద నిమగ్నం అవడం అందరికీ తెలిసిందే. ఇక నేటి ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా సాగింది. లక్ష్మణ్ ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్ళినా అతని గతం గుర్తు చేసి నీలాంటి అశ్రద్ధగా ఉండే వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడం కుదరదని చెబుతుంటారు. దీంతో నిరాశలో కూరుకుపోయి తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉంటాడు.
ఆకలికి తట్టుకోలేక
ఇక మరో పక్క ఇంట్లో శైలు కొడుకు ఆకలికి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటాడు.. సెరిలాక్ లాంటిది పెడదామని ప్రయత్నం చేసినా ఇంట్లో అన్ని వస్తువులతో పాటు అది కూడా నిండుకుంటుంది. ఇక మరో పక్క సిరి వంట చేయడానికి ప్రయత్నం చేస్తుంటే గ్యాస్ కూడా అయిపోతున్నట్లు అనిపిస్తోంది. దీంతో విషయం సీతకు చెప్పడంతో సీత రఘురాంకి ఫోన్ చేసి విషయం చెబుతుంది. గ్యాస్ కూడా స్ట్రైక్ చేయడానికి సిద్ధమైందని రేపటి నుంచి పని చేయను అని చెబుతోంది అని చెబుతూ అసలు విషయం చెబుతుంది.
బాబుకి పాలు ఇచ్చిన సీత
ఇక మరోపక్క శైలు కొడుకు ఎంతకు ఆకలి తీరకపోవడంతో ఏడుస్తూనే ఉంటాడు. దీంతో శైలు వాడిని తీసుకుని సీత వద్దకు వెళుతుంది. పాల కోసం ఏడుస్తున్నాడని తెలిసి సీత పాల ప్యాకెట్ తీసుకు వస్తానని బయటకు వెళ్ళబోతుంది. అయితే శైలు బయటికి వెళ్లి తేవడం కాదని ఇలాగే గతంలో ఒకసారి ఏడిస్తే నువ్వు ఎలాగ పాలు ఇచ్చావో అలాగే ఇవ్వాలని కోరుతుంది. దీంతో కన్నీళ్లు పెట్టుకుని సీత ఆ బాబుకి పాలు ఇవ్వడంతో పాలు తాగిన బాబు ఏడవడం ఆపేస్తాడు.
తన మీద తనకే అసహ్యం
ఇక శైలు గతంలో తాను బాబుకు పాలు పట్టను అంటూ తనకు తన ఫిజిక్ ముఖ్యమని చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చి తన మీద తనకే అసహ్యం కలుగుతుంది. తాను చేసిన తప్పుకు తన బిడ్డ ఇబ్బందులు పడుతున్నాడని భావించి బాధపడుతుంది. ఇంతలో రాత్రి అవుతుంది. అందరూ ఇళ్లకు చేరిన చాలా సేపటికి లక్ష్మణ్ ఇంటికి చేరుతాడు. తాను ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం దొరకడం లేదని అపార్ట్మెంట్ కూలిన విషయాన్ని ఎత్తి పొడుస్తున్నారని బాధపడతాడు.
కొంత టైం పడుతుంది
అందుకే కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండమని చెప్పిన సంగతి చేసిన రఘురాం నీ మీద పడిన నింద జనం మర్చిపోవాలంటే కొంత సమయం పడుతుందని అంటాడు. ఇక ఇంతలో శైలు వచ్చి పిల్లవాడికి డైపర్లు తెచ్చావా అని అడుగుతుంది. అయితే వాడి ఫుడ్ మాత్రమే దొరికిందని డైపర్ లకు డబ్బులు సరిపోలేదు అని అంటాడు. వెంటనే శైలు డబ్బులు లేకుంటే తినడం మానేస్తామా ? అలాగే వాడి డైపర్స్ లేకుండా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తుంది.
Recommended Video
రాత్రంతా కరెంట్ కూడా
ఇంతలో సీత కల్పించుకొని ఒక అరగంటలో డ్రైవర్లు ఇప్పిస్తానని చెప్పి కానీ కొన్ని గుడ్డలను సిద్ధం చేసి డైపర్లని రెడీ చేస్తుంది. అవి చూసిన శైలు ఆశ్చర్యపోతుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాత ఎపిసోడ్లో సిరి తల్లి ఇంట్లోకి రావడం, మళ్లీ ఏదో అనాలని ప్రయత్నించడం చూపిస్తారు. అలాగే రాత్రంతా కరెంటు లేక రఘురాం కుటుంబం అంతా ఇబ్బంది పడినట్లు కూడా చూపించారు.