Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Vadinamma : 'రిషి' అసలు తల్లి తండ్రుల నిజం చెప్పేసిన రాజేశ్వరి.. షాక్ లో లక్ష్మణ్!
వదినమ్మ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతం రఘు రామ్, సీత కడుపున పుట్టిన రిషి అనారోగ్యం పాలు కావడంతో హాస్పిటల్ లో చేర్చిన సంగతి తెలిసిందే. ఆ బుడతడి లివర్ పాడవడంతో ఐసీయూలో పెడతారు డాక్టర్లు.. అయితే మరో పక్క తన కుమారుడిని తన చేతుల్లో నుంచి లాక్కుని వెళ్ళిపోయింది అంటూ షాక్ లో ఉండిపోయిన శైలు కూడా తలకు గాయం కావడంతో అదే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. రాజేశ్వరి వచ్చి బాబుని తీసుకువెళ్లి శైలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉండగా వాడికి లివర్ బాగోలేదని ఐసీయూలో ఉన్నాడనే విషయం చెబుతుంది సీత.
మీ లాగానే ఇంకా ఎవరైనా వచ్చి చేయాలని చూస్తే నేను తల్లి, నా భర్త తండ్రి అనే విషయాన్ని అందరికీ చెబుతానని భయపెడుతుంది. ఎంత జరుగుతూ ఉండగా లక్ష్మణ్ అప్పుడే ఆఫీసు నుంచి హాస్పిటల్ కి వస్తాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బతికి ఉండాలి
లక్ష్మణ్ వచ్చి చూస్తే భార్య స్పృహ లేకుండా హాస్పిటల్ బెడ్ మీద పడి ఉంటుంది.. అసలు ఆమెకు ఏమైంది అని మామను అడిగితే స్పృహ కోల్పోయింది అని సీత మీ కొడుకుని లాక్కొని వెళుతూ ఈమె మీద దాడి చేసిందని చెబుతాడు. అదేమిటి అలా చేయడం ఏమిటి? అని అడిగితే నేను అదే విషయం మాట్లాడదామని వెళితే నా నోరు నొక్కి పంపించారు.
మీ అన్నదమ్ముల మధ్య దూరం పెరుగుతుందేమో అనే ఉద్దేశంతో నేను ఎలాంటి గొడవ చేయకుండా వెనక్కి వచ్చేసాను అని జనార్ధన్ చెబుతాడు. లక్ష్మణ్ తో పాటు వచ్చిన నాని ఇప్పటికే విడివిడిగా బతుకుతున్నాం ఇంకా దూరం పెరిగేది ఏంటి? మీరు బాబును తీసుకు రావాల్సింది అని అంటాడు.
అయితే లక్ష్మణ్ అలా మాట్లాడుతూ ఉండగా శైలు లేచి కూర్చుంటుంది. నా బాబు ఎక్కడ నా బాబు ఎక్కడ అని అడుగుతూ బతికితే నేను అయినా బతికి ఉండాలి లేదా వాళ్ళ అయినా బతికి ఉండాలి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది.
లక్ష్మణ్ కు కోపం వచ్చి
అలా మాట్లాడిన ఆమె మళ్లీ స్పృహ కోల్పోతుంది. దీంతో లక్ష్మణ్ కు కోపం వచ్చి అన్నా వదిన ఎక్కడ ఉన్నారో చూసి బాబు ని తీసుకొచ్చి ఇవ్వాలని బయలుదేరి వెళతాడు.. లక్ష్మణ్ వెళుతూ ఉండగా దారిలో భరత్ ఆపుతాడు. ఎక్కడికి అన్న వెళుతున్నావు అంటే నీకు చెప్పాలా నా కొడుకుని లాక్కొచ్చి హాస్పిటల్ లో పెడతారా అంటూ సీరియస్ అవుతాడు.
బాబు ఆరోగ్యం బాలేదు అందుకే బాబును అన్న వదిన తీసుకువచ్చారని వాళ్లే డాక్టర్లతో మాట్లాడుతున్నారన్న విషయాన్ని చెబుతాడు భరత్. అయినా తండ్రిని నేను ఉన్నాను కదా నాకు తెలియకుండా ఇలా చేయడం ఏంటి అంటూ లక్ష్మణ్ సీరియస్ అవుతాడు. మనల్ని ఇప్పటిదాకా పెంచి పెద్ద చేసింది వాళ్లే అన్న విషయం మర్చిపోయావా వాళ్లు మనకు ఎన్ని విషయాల్లో అండగా నిలబడ్డారు అంటూ భారత్ ప్రశ్నిస్తాడు.
చింపి పడేస్తుంది
ఇంతలో అక్కడికి వచ్చిన జనార్దన్ ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి అని భావించి మీ కొడుకుని వాళ్ళు కిడ్నాప్ చేశారు అన్నట్లు ఒక కంప్లైంట్ ఇవ్వు. వాడిని తీసుకువచ్చి అప్పగించే బాధ్యత నాది అంటాడు.. దానిమీద లక్ష్మణ్ సంతకం పెట్టడానికి సిద్ధమవుతున్న క్రమంలో భరత్ సీరియస్ అవుతాడు అలా ఎలా పెడతావు అంటూ గట్టిగా ప్రశ్నిస్తాడు.
పెడితే ఏం చేస్తావంటే పెట్టిన చేతిని నరికే వేస్తానని ఘాటు కామెంట్లు చేయడంతో గొడవ పెద్దది అవుతుందని భావించి సిరి అతనిని బయటకు తీసుకు వెళుతుంది. అయితే భారత్ అలా మాట్లాడడంతో హర్ట్ అయిన లక్ష్మణ్ సంతకం పెడతాడు. సంతకం పెట్టి ఆ కాగితాన్ని జనార్ధన్ ఇవ్వబోతున్న క్రమంలో రాజేశ్వరి ఆ కాగితాన్ని తీసుకుని చింపి పడేస్తుంది.
సీతను ఒప్పించే పనిలో
జనార్ధన్ ఏం చేయాలో తెలియక నీ బిడ్డకు ఏమైనా జరిగితే నువ్వు ఉంటావ్ ఏమో గానీ నా బిడ్డకు జరిగితే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ సీరియస్ అవుతూ అక్కడ నుండి వెళ్ళి పోతాడు. మరోపక్క రఘురాం కు అన్ని టెస్టులు పూర్తి చేసిన డాక్టర్లు మీరు లివర్ ఇవ్వడానికి అర్హులు కానీ మీకు గుండె సమస్య ఉండడంతో మీరు ఇవ్వడానికి ఇప్పుడు ఇబ్బంది అంటారు.
ఒకవేళ ఇచ్చినా 30 శాతం వరకు ఉపయోగపడుతుంది అన్నట్లు చెబుతారు. ఒక ప్రాణం నిలబెట్టడం కోసం మరో ప్రాణాన్ని బలి చేయడం తమ వల్ల కాదని డాక్టర్లు తేల్చి చెబుతారు. లేదు నేను నా భార్య ను ఒప్పించి అన్ని విధాలుగా సిద్ధంగానే ఉన్నాను అని చెప్పి సీతను ఒప్పించే పనిలో పడతాడు. మరోపక్క లక్ష్మణ్ తల్లి దగ్గరికి వచ్చి నువ్వెందుకు వాళ్ళను సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు అని ప్రశ్నిస్తాడు. చాలా సేపు తటపటాయించిన తరువాత నేను నీ కోసమే అలా చేశానని రాజేశ్వరి అంటుంది.
Recommended Video
నిజం తెలియడంతో
అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగించారు. ఇక తదుపరి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రిషికి లివర్ ఇవ్వబోయేది వాళ్ల కన్న తండ్రి అని ఆమె అంటుంది. మొత్తం మీద నిజం తెలియడంతో లక్ష్మణ్ ఊహించని విధంగా షాక్ అవుతాడు. తన తల్లి ఇలా చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక ఆయన మధన పడుతున్నట్లు కనిపిస్తోంది. శైలు కూడా ఈ విషయం చెబుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.