Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Vadinamma: రఘుకి వరుస షాకులు ఇస్తున్న లక్ష్మణ్.. పెళ్ళాం పిల్లలే ముఖ్యం అంటూ మామతో కలిసి?
రఘు రామ్ రిషిని తీసుకుని షాప్ కు వెళ్ళడంతో శైలు పెద్ద రచ్చ చేసిన సంగతి తెలిసినే. తరువాతి రోజు కూడా అదే పరిస్థితి ఎదురు కాగా బాబును పైకి తీసుకు వెళ్లి సముదాయిచబోతుంది. అంతలో బాబు మెట్ల మీద నుంచి పడిపోగానే తీవ్ర గాయాలు అవుతాయి. దీంతో వాళ్ళు హాస్పిటల్ కి వెళితే అక్కడ పెద్ద రచ్చ జరుగుతుంది. బాబు కోలుకొని బయటకు వచ్చినా జనార్దన్ ఎంట్రీతో కుటుంబంలో మరిన్ని సమస్యలు మొదలయ్యాయి. అనాధ పిల్లలను దత్తత తీసుకోవాలి అని లక్ష్మణ్ అన్నయ్యకు నేరుగా చెప్పకుండా అనాధాశ్రమం అధికారులను ఇంటికి తీసుకువస్తాడు. వారిని చూసి షాక్ అయిన రఘురామ్ ఏం మాట్లాడాలో అర్థం కాక బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు. అలా గత ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Photo Courtesy: Star మా and Disney+Hotstar
సర్ది చెప్పిన రఘు
అనాధ ఆశ్రమం మంచి వచ్చిన వారితో రఘురాం మాట్లాడుతూ నాకు మా తమ్ముళ్ళు పిల్లలు, వారికి మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు వేరే పిల్లలను దత్తత తీసుకో వలసిన అవసరం లేదు అంటాడు.. నా గురించి తెలియక మా తమ్ముడు పొరపాటున అలా మిమ్మల్ని తీసుకు వచ్చాడు అని దానికి క్షమించమని కోరతాడు. నేను మీ అడ్రస్ కి డొనేషన్ పంపిస్తాను అని దయచేసి అర్థం చేసుకుని ఇక్కడి నుండి వెళ్లిపోవాల్సిందిగా కోరుతాడు.. వాళ్లు రఘురాం బాధను అర్థం చేసుకుని అక్కడ నుంచి నిష్క్రమిస్తారు. అయితే ఆ తర్వాత రఘురాం తన తమ్ముడిని ఇలా ఎందుకు చేసావు అని అడిగితే పిల్లల కోసం పడుతున్న తాపత్రయం చూడలేకపోతున్నాం అని అంటా
తమ్ముడి మాటలకు కుంగిపోయి
ఈ విషయంలో లక్ష్మణ్ మీద సీరియస్ అయిన రాజేశ్వరి నీకు అంతగా ఉంటే నీ కొడుకు ని దత్తత ఇవ్వు అంతేగాని ఎవరో అనాధ పిల్లలు తీసుకొచ్చి ఇస్తానని అవమానిస్తావా అంటుంది. అయితే రఘురాం తమ్ముడు నా బాధ చూడలేక అలా మాట్లాడి ఉంటాడు దయచేసి అతనిని ఏమీ అనుకోవద్దు అన్నాడు. అయితే లక్ష్మణ్ నీ బాధ చూసి ఇలా చేయలేదని తన భార్య పిల్లాడి గురించి ఆలోచించి ఇలా చేశాడు అని రాజేశ్వరి అంటుంది. ఈ విషయం మీద సీరియస్ అయిన లక్ష్మణ్ అవును నేను వాళ్ళ కోసమే అలా చేశాను అయితే తప్పేంటని ప్రశ్నిస్తాడు. అయితే తమ్ముడు మీద చాలా నమ్మకం పెట్టుకున్న రఘురాం తమ్ముడి మాటలకు కుంగిపోతాడు.
నేను ఉండలేనా?
తర్వాత ఒంటరిగా రాజేశ్వరి దగ్గరకు వెళ్లి తన బాధ వ్యక్తం చేస్తాడు అయితే రాజేశ్వరి మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు లక్ష్మణ్ కి అసలు రిషి తన కొడుకు కాదు అనే విషయం తెలియదు. వాడికి అసలు విషయం తెలిస్తే అప్పుడు నీ దగ్గరకు తీసుకు వస్తాడు అన్నట్లుగా మాట్లాడుతుంది. అయితే అలా నిజం తెలిస్తే రిషి గురించి సీత చేసిన త్యాగం ఏమిటి అని రఘురామ్ ప్రశ్నిస్తాడు. అయితే సీత చేసిన త్యాగాన్ని నిరూపించడం కోసం నువ్వు ఏమీ మాట్లాడకుండా ఉంటావా ఇంతలా బాధ పడతావా అని ప్రశ్నిస్తుంది. అయితే తాను ఇకమీదట బాబు దగ్గరకు వెళ్లి ఆడుకోవడం తగ్గిస్తానని పేగు బంధాన్ని తెంచుకుని సీత జాగ్రత్తగా ఉంటే నేను ఉండలేనా అని ప్రశ్నిస్తాడు.
శైలు బిడ్డగానే ఇక
అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉన్న సమయంలో సీత, సిరి కలిసి గుడికి వెళతారు. సీత దేవుడిని మొక్కు కోవడం చూసి నువ్వు గనుక బాబును రఘురాం బావగారికి దగ్గర చేయాలి అని ఆలోచిస్తున్నట్లు అయితే నువ్వు ఎన్ని మొక్కులు మొక్కినా పనికిరావు, కేవలం శైలు దగ్గరకు వెళ్లి ఈ బాబు నీకు పుట్టిన బాబు పుట్టిన బాబు అని చెబితే తప్ప దానికి ఒక సొల్యూషన్ దొరకదు అని తేల్చి చెబుతోంది. అయితే అదేమీ లేదని ఒక్కసారి నా బిడ్డ శైలు కొడకుగా శైలు కి పరిచయం అయ్యాక మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం లేదని, ఋషి శైలు బిడ్డగానే ఇక పెరుగుతాడు అని ఆమె అంటుంది.
నా మనవరాలు జోలికి వస్తే వదిలేది లేదు
ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే మరోపక్క ఇక్కడ జరిగిన విషయాలు అన్నీ కూడా దుర్గ తీసుకెళ్లి పార్వతికి చేరవేస్తుంది. పార్వతికి చేరవేయడమే కాక ఇలా దత్తత వ్యవహారం కూడా చెప్పి రఘురాం అనాథ పిల్లలను దత్తత తీసుకోనని చెప్పాడట అంటుంది. అలా అంటూనే ఈసారి వైదేహి మీద కన్ను వెస్తారేమో జాగ్రత్త ఆ పాపని తీసుకెళ్లి పొట్లాలు కట్టడం నేర్పించిన నేర్పిస్తారు అన్నట్లు మాట్లాడుతుంది దుర్గ. అయితే పార్వతి సీరియస్ అయి అలా ఎలా వదిలేస్తాను అప్పుడు రఘురాం వంతు చూస్తాను, నా మనవరాలు జోలికి వస్తే ఎవరిని వదిలేది లేదు అంటూ ఫైర్ అవుతుంది.
కమింగ్ అప్ ప్రకారం
మరోపక్క జనార్ధన్ పని చేసుకుంటున్న భరత్, రఘురాం దగ్గరికి వెళ్లి నా అల్లుడికి ఈ దత్తత వ్యవహారం గురించి చెప్పింది నేనే బాగా వర్కౌట్ అయిందన్నట్లు ఎగేసి మాట్లాడుతాడు. దీంతో భరత్ కి కోపం నషాలానికి అంటుతుంది. అన్నయ్య ని కడిగి పారేయాలి అనే ఉద్దేశంతో ఇంటికి వెళతాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం అవును ఈ సలహా మావయ్య గారు ఇచ్చారు ఐతే తప్పేంటి ఆయనని కలవకూడదా అన్నట్టుగా లక్ష్మణ్ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు దీంతో షాక్ అయిన రఘురాం అలాగే చూస్తూ ఉండిపోతాడు.