Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Vadinamma: షాకింగ్ నిర్ణయం తీసుకున్న సీత.. ఆ విషయం రివీల్ చేయడంతో లేచి కూర్చున్న రఘురామ్?
రఘు రామ్- సీతల పెళ్లి రోజును కుటుంబ సభ్యులు అందరూ కలిసి గ్రాండ్ గా జరుపుకున్న తరువాత రఘురాంకు గుండె పోటు వస్తుంది. రఘురాంకి గుండెపోటు వచ్చిందని తెలియడంతో వెంటనే హుటాహుటిన ఆయనను హాస్పిటల్ కి చేరుస్తారు. వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళడంతో డాక్టర్ రఘురాంకి చికిత్స చేయడం మొదలుపెడతారు. అయితే రఘు రామ్ చికిత్సకు స్పందించడం లేదని చెబుతూ డాక్టర్ తన చేతుల్లో ఏమీ లేదని చెబుతాడు. మరో పక్క దమయంతి, జనార్ధన్, పార్వతి ఇంటికి వచ్చి రఘురాం ఇక బతకడు అని చెబుతూ ఉన్న ఆస్తిని పంచాలని కోరతారు. అక్కడికి వచ్చి ఆ మాటలు విన్న సీత కోపంతో ఊగిపోతూ మీ కూతుళ్లకు అల్లుళ్లకు ఇష్టం అయితే ఇక్కడి నుంచి తీసుకుపోమని అంతుంది. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
Photo Courtesy: Star మా and Disney+Hotstar
పట్టరాని కోపంతో రాజేశ్వరి
తమకు ఆస్తి పంచి ఇవ్వాలని, పుట్టింటికి తీసుకు వెళతామని చెప్పిన తండ్రికి బుద్ది వచ్చే విధంగా శైలు ముఖం మీదే బయటకు పొమ్మని చెబుతుంది. శైలు లాగే సిరి కూడా తన తల్లిని తిట్టి మరోసారి ఈ ఉద్దేశంతో అసలు ఇంటికి రావద్దని చెబుతుంది. ఇక ఇంతలో శిల్ప కూడా ఇక మీదట మా ఇంటికి ఈ ఉద్దేశంతో రావద్దని తల్లికి తేల్చి చెబుతుంది. ఇక వాళ్లు అందరూ వెళ్లిపోయిన తరువాత రఘుకు ఎలా ఉంది అని రాజేశ్వరి లక్ష్మణ్ ను అడుగుతుంది. పరిస్థితి క్రిటికల్ గా ఉందని డాక్టర్ చెప్పిన విషయాన్ని చెబితే ఆయన లేవకపోతే మా మీద ఒట్టే అని చెప్పకపోయారా? అని సీతను దెప్పి పొడుస్తుంది. సిరి, సీత సముడాయించడంతో నాకు ఎందుకు ఈ గోల అని లోపలకి వెళ్తుంది.
అంతా నీ వల్లే అంటూ
మరో వైపు శైలు అంతా నీ వల్లే జరిగింది అని లక్ష్మన్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. అసలు నేనేం చేశాను? అని ప్రశ్నిస్తే అసలు జాతరలో జరిగిన విషయం విన్న తరువాత ఇక జన్మలో ఆయనతో మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ నువ్వే బావ - సీతక్క ల పెళ్లి రోజున బంధువులు అంటూ పిలిచావు, దాని వల్లే ఇప్పుడు వాళ్ళు ఇంతలా తెగించారు అని అంటుంది. బావ గారు మనకు దక్కరు అంటుంటే నాకే కోపం తగ్గలేదు, ఇక సీతక్కకి ఎంత కోపం వచ్చిందో నేను అర్థం చేసుకోగలను, మా మామయ్యను కొట్టడంలో ఏమాత్రం తప్పు లేదు అని శైలు అంటుంది. నాకేం తెలుసు వాళ్ళు ఇలా చేస్తారు అని, నీ తల్లితండ్రులు నావల్ల దూరం కాకూడదు అని నేను అనుకున్నాను అని లక్ష్మణ్ అంటాడు.
ఎంత చెప్పినా వినని సీత
ఇక మరో పక్క రాత్రి నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తున్న సీత దగ్గరకు వెళ్ళిన రాజేశ్వరి ఆమెను సముదాయించే ప్రయత్నం చేస్తుంది. సీత చేసిన పని కర్కెట్ కాదని ఇక మీదట అయినా ఆ విషయం రఘురాం కి చెప్పాలని అంటుంది. నువ్వు దానం చేయడం కరెక్ట్ కాదని, నువ్వేమీ దాన కర్ణుడివి కాదు, శిబి చక్రవర్తి కూడా కాదు, దయ చేసి ఇప్పటికీ అయినా నా మాట వినమని అంటుంది. అయితే అలా చేయడం కరెక్ట్ కాదని సీత అంటుంది. నేను ఇచ్చింది నా కొడుక్కే కదా, నా కళ్ళ ముందే పెరుగుతున్నాడు కదా అంటే, నువ్వు కూడా ఒక అమ్మవే కదా, నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని ప్రశ్నిస్తుంది. సీత ఎంతకు మాట వినకపోవడంతో, ఇక లాభం లేదు అనుకొని వెనక్కి వెళ్లి పోబోతుంది, సీత వెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తే ఆమె మీద మళ్ళీ కోప్పడుతుంది.
బుడతడి నిర్ణయంతో
ఇదంతా విన్న తరువాత సీత ఆలోచిస్తుంది. ఆలోచించి, సీత రిషి దగ్గరకు వెళ్లి రెండు వేళ్ళు చూపించి వీటిలో ఒక వేలు పట్టుకుంటే నీ తండ్రికి నువ్వే కొడుకువని చెబుతానని రెండో వేలు పట్టుకుంటే ఆ నిజం చెప్పనని అంటుంది. ఎన్నో విషయాలు కొడుక్కి చెప్పి, ఇది నీ చేతుల మీదనే అవ్వాలి, నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని మారుస్తుంది అని చెబుతోంది. అయితే ఆ బుడతడు నిజం చెప్పమనే వేలు పట్టుకోవడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆనంద పడిన సీత ఈ విషయం రాజేశ్వరికి సైతం చెబుతుంది. దీంతో ఆమె చాలా ఆనంద పడుతుంది. అలాగే సీత హాస్పిటల్ కి రిషిను తీసుకుని బయలుదేరి వెళుతుంది.
తరువాతి ఎపిసోడ్ ఆసక్తికరంగా
ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు, తరువాత ఎపిసోడ్ లో చూపిస్తున్న దాని ప్రకారం రఘురాం స్పృహలో లేని సమయంలోనే ఆమె రఘురాంకి విషయం చెబుతుంది. జరిగిన విషయం అంతా చెప్పి రఘురాంకి ఆనందం కలిగేలా చేస్తుంది. ఈ మాటలు విని స్పృహలోకి వచ్చిన రఘురాం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తాడు. తన కొడుకు అని తెలిసిన వెంటనే ఆనందం వ్యక్తం చేస్తూ ఎత్తుకుని ముద్దాడుతాడు. ఇంతలో తన కొడుకు కనిపించడం లేదని అంటూ శైలు, లక్ష్మన్ వెతుక్కుంటూ హాస్పిటల్ కి వస్తారు. అక్కడ ఇదంతా వారు చూస్తారు! . దీంతో తదుపరి ఎపిసోడ్ మీద అంచనాలు పెరుగుతున్నాయి.