Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పోగ్రాం ఆపమంటూ... టీవీ ఛానల్ స్టాఫ్ కిడ్నాప్
చెన్నై : టీవీ ఛానల్కు చెందిన ఏడుగురుని కిడ్నాప్ చేసినట్లు నగర పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనికి సంబంధించి నగరంలోని ఓ ప్రైవేటు టీవీ ఛానల్కు చెందిన సీనియర్ అధికారి అశోకన్(56) నగర పోలీసు కమిషనర్ జార్జ్కు బుధవారం ఉదయం ఫిర్యాదు చేశారు.
తమ ఛానల్లో పని చేసే వసంతన్, గోపి, నోబల్తోపాటు మొత్తం ఏడుగురుని మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు గుర్తు తెలియనివ్యక్తులు కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. నిందితులను గుర్తించి తమ సిబ్బందికి వారి చెర నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తమ ఛానల్లో 'వాయ్మయే వెల్లుం' (నిజాయతీనే విజయం వరిస్తుంది) కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా అత్యాచారానికి గురైన ఓ యువతి ఈ కార్యక్రమంలో పాల్గొని తనను ఈ స్థితికి తెచ్చిన వ్యక్తి గురించి చెప్పారన్నారు.
ఆ కార్యక్రమం ప్రసారం సందర్భంగా ఓ ముఠా తమను బెదిరించిందని, వారే తమ సిబ్బందిని కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసుని ధర్యాప్తు చేసి త్వరలోనే ఆ ఏడుగురుని విడిపిస్తామని పోలీస్ కమీషనర్ హామీ ఇచ్చారు. అలాగే ఏడుగురు కుటుంబాలు వారు కంగారు పడాల్సిన పనిలేదని,పోలీసులు త్వరలోనే ఈ కేసుని ఛేదిస్తారని ఆయన అన్నారు.