Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జారిపడి, తలకి దెబ్బ తగిలి... సూపర్ హిట్ సీరియల్స్ డైరక్టర్ మృతి
గంగ,వీర వంటి సీరియల్స్ తో నార్త్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన టీవీ సీరియల్ దర్శకుడు వశీమ్ సబీర్ మృతి చెందారు.
ముంబై: గంగ,వీర వంటి సీరియల్స్ తో ఉత్తరాది ప్రేక్షకులను ఉర్రూతలూగించిన వశీమ్ సబీర్ మృతి చెందారు. జనవరి 1, ఆదివారం నాడు...పడిపోవటంతో తలకు దెబ్బ తగిలింది. వెంటనే హాస్పటిల్ కు తీసుకు వెళ్లారు. మరుసటి రోజు సోమవారం నాడు మృతి చెందాడు. ఆయన డైరక్ట్ చేసిన సీరియల్స్ తెలుగుతో సహా చాలా భాషల్లోకి డబ్ అయ్యాయి.
ఆయన మృతికి టీవి ఇండస్ట్రీ అంతా నివాళులు అర్పించింది. ఆయన డైరక్ట్ చేసిన టీవి సీరియల్ లో నటించిన నటీ నటులు అంతా సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం తెలియచేసారు. ఆయన చాలా ప్రతిభావంతుడుని, అంతటి టాలెంటెడ్ దర్శకుడుని టీవి ఇండస్ట్రీ కోల్పోవటం దురదృష్టమని వ్యాఖ్యానించారు.
ఆయన కేవలం టీవి సీరియల్స్ మాత్రమే కాకుండా తమన్నా, ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్...ఏక్ బార్ ఫిర్ వంటి టీవి షోలు కూడా చేసారు. ఆయన చేసిన టీవి సీరియల్స్, షోలు సూపర్ హిట్ అయ్యి నిర్మాతలకు కోట్లు సంపాదించి పెట్టాయి.
డ్రామా బాగా పండించగలడని పేరున్న వశీమ్..సెట్ లో డైలాగులు చాలా భాగం రాసుకునేవారిని, అలాగే ఎడిటింగ్ టేబుల్ పై కూర్చూంటే నిముషాల్లో పని పూర్తయ్యేదని, అలా అన్ని రకాలుగా మల్టి టాలెంట్ ఉన్న వశీమ్ వంటి దర్శకులు ఇండస్ట్ర్రీలో అరుదని ఆయనతో పనిచేసిన నిర్మాతలు వ్యాఖ్యానిస్తున్నారు.