Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కరోనాకు హాఫ్ కిలోమీటర్ దూరంలో.. ఏం తోచట్లే అంటోన్న వెన్నెల కిషోర్
ప్రస్తుతం కరోనా ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణ, అందులోనూ హైద్రాబాద్లో పరిస్థితి చేజారినట్టే కనిపిస్తోంది. రోజురోజుకు వేలల్లో కరోనా కేసుల బయట పడుతున్నాయి. కరోనా ఉధృతి పెరుగుతూనే ఉంది కానీ తగ్గడమే లేదు. రాష్ట్రంలోని కేసులన్నింటిలో పోల్చితే హైద్రాబాద్లోనే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో వెన్నెల కిషోర్ అయోమయంలో పడ్డట్టు కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వెన్నెల కిషోర్ ప్రతీ విషయంపై తనదైన శైలిలో స్పందిస్తాడు. వెండితెరపై సెటైర్ వేసినట్టుగానే.. సోషల్ మీడియాలోనూ పంచ్లు వేస్తుంటాడు. తాజాగా వెన్నెల కిషోర్ వేసిన సెటైర్, చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ను అందరూ వాడాలని చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే వెన్నెల కిషోర్ కూడా ఆరోగ్య సేతు యాప్ను వాడుతున్నాడు. అయితే తాజాగా కరోనా అప్ డేట్స్ చూస్తే వెన్నెల కిషోర్కు దిమ్మతిరిగినట్టు తెలుస్తోంది.
ఆరోగ్య సేతు యాప్లోనే డేటా ప్రకారం.. గడిచిన 28 రోజుల్లో ఆరోగ్య సేతు యాప్ వాడుతున్న వారిలో ఏడుగురు కరోనా బారిన పడ్డారట. అది కూడా వెన్నెల కిషోర్ ఉంటున్న ప్రాంతానికి అర కిలో మీటర్ దూరంలోనే అంటా. అయితే ఈ విషయంలోనే వెన్నెల కిషోర్ అయోమయానికి గురవుతున్నాడట, ఏం చేయాలో తోచట్లే అంటూ తన దైన శైలిలో ఓ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ హల్చల్ చేస్తుంది. దీన్ని బట్టే హైద్రాబాద్లో కరోనా ఏ స్టేజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.