అజ్ఞాతంలో ప్రముఖ హీరోయిన్.... నిర్మాత వల్ల గర్భవతి అయిందంటూ పుకార్లు?
రస్నా అనే టీవీ సీరియల్ నటి అదృశ్యం కావడం చర్చనీయాంశం అయింది.
చెన్నై: తమిళం, మలయాళం భాషల్లో ప్రసారం అయిన సూపర్ హిట్ సీరియల్ 'పారిజాతం'లో హీరోయిన్గా నటించిన రస్నా..... ఇపుడు ఎవరికీ కనిపించకుండా పోవడం మలయాళం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
ఆమె ఎక్కడ ఉందనే విషయం ఎవరికీ తెలియడం లేదు. బంధువులు కూడా రస్నా కోసం వెతుకున్నట్లు సమాచారం. అయితే ఆమె ఎవరికీ కనిపించకుండా పోవడానికి ఓ పెళ్లయిన నిర్మాతతో ఎఫైరే కారణమని టాక్.

రస్నా గర్భవతి అయిందంటూ పుకార్లు?
కొంత కాలంగా సదరు నిర్మాతతో ప్రేమాయణం సాగిస్తున్న రస్నా అతడి వల్ల గర్భవతి అయిందని, ఆల్రెడీ పెళ్లయి పిల్లలున్న ఆ నిర్మాత ఇబ్బందుల్లో పడతాడనే కారణంతో ఈ విషయ బయటకు తెలియకుండా ఎవరికీ కనిపించకుండా పోయిందని మలయాళం మీడియాలో ప్రచారం జరుగుతోంది.

రహస్య ప్రదేశంలో రస్నా
రస్నాను ఓ రహస్య ప్రదేశంలో ఉంచిన సదరు నిర్మాత ఆమె బాగోగులు చూసుకుంటున్నారని, ఈ విషయం బయటకు తెలిస్తే చాలా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉండటం వల్లనే వ్యవహారం అంతా సీక్రెట్గా నడుస్తుందని తెలుస్తోంది.

కొంతకాలం వరకు అంతే...
ప్రస్తుతం రస్నా డెలివరీకి సిద్ధంగా ఉందని, కొన్ని రోజుల్లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోందని..... ఆ తర్వాత సదరు నిర్మాత ఆమెను పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

నిర్మాత పేరు సహస్యంగా...
అయితే రస్నాకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమైన ఆ నిర్మాత ఎవరు? అనే విషయాన్ని మాత్రం ఎవరూ బయట పెట్టడం లేదు. దీని వెనక మిస్టరీ ఏమిటో కొన్ని రోజుల్లో తేలనుంది.


Click it and Unblock the Notifications











