Don't Miss!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
తీవ్ర విషాదంలో యష్ మాస్టర్.. ఇలాంటి ఓ రోజు వస్తుందనుకో లేదు, బ్లడ్ కాన్సర్, బ్లడ్ కావాలంటూ పోస్ట్!
తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ యష్ మాస్టర్ సుపరిచితమే. ఢీ షోలో ఒక కంటెస్టెంట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన తరువాతి కాలంలో కొరియోగ్రాఫర్ గా కూడా తన సేవలందించారు. అయితే ఢీ షో తర్వాత ఓంకార్ నిర్వహించిన డాన్స్ ప్లస్ రియాల్టీ షోలో కూడా ఆయన జడ్జిగా కూడా వ్యవహరిస్తూ వచ్చారు. తాజాగా ఆయన తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Recommended Video
చిన్నప్పటి నుంచే
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తిలో జన్మించిన యశ్వంత్ మాస్టర్ చిన్నప్పటి నుంచి డాన్స్ మీద అమితమైన ప్రేమ పెంచుకున్నాడు. హుబ్లీలో తన చదువు పూర్తి చేసుకున్న తర్వాత కన్నడ రియాలిటీ షో అయినా డాన్సింగ్ స్టార్స్ అనే ఒక రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఈ షో ఈటీవీ కన్నడ ఛానల్ లో ప్రసారం అయింది. ఆ తర్వాత తెలుగులో ఢీ షో ద్వారా ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చాడు.
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా
ముందుగా క్యాట్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కొన్నాళ్ళు పనిచేసి ఆ తర్వాత సొంతంగా ఒక టీం ఫామ్ చేసుకుని కొరియోగ్రాఫర్ గా మారాడు. తన టాలెంట్ తో అనతికాలంలోనే యశ్వంత్ మాస్టర్ మంచి పేరు తెచ్చుకున్నాడు.
సమంత హీరోయిన్ గా నటించిన యూటర్న్ సినిమా ద్వారా పూర్తిస్థాయి కొరియోగ్రాఫర్ గా మారిన ఆయన ఆ తర్వాత అనేక సినిమాల్లో కూడా తన సేవలందించాడు. చివరిగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
విషాదంలో యష్
గత ఏడాది ఈ టీవీలో ప్రసారమైన ఢీ ఛాంపియన్స్ షో పూర్తయిన తర్వాత ఆయన ఓంకార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన డాన్స్ ప్లస్ అనే రియాలిటీ షోలో ఒక జడ్జిగా పాల్గొని ప్రేక్షకులను అలరించారు. అయితే యశ్వంత్ మాస్టర్ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఒక వీడియో కంటతడి పెట్టిస్తోంది. యష్ మాస్టర్ వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్న కేవల్ అనే ఒక డాన్సర్ ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ బారిన పడినట్లు తెలుస్తోంది.
బ్లడ్ కాన్సర్ తో
ఆయనను ప్రస్తుతం వెల్లూరులో ఉన్న హాస్పిటల్ లో చేర్పించామని అర్జెంటుగా 12 మంది రక్తం ఎక్కించాలని యష్ మాస్టర్ ఒక వీడియో విడుదల చేశాడు. ఇలా సోషల్ మీడియా ముందుకు వస్తానని కలలో కూడా అనుకోలేదని కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటి పోయే పరిస్థితిలో ఇలా అడగడం తప్ప ఏమీ చేయలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు.
ప్రియమణి కూడా
బ్లడ్ ఇవ్వడం కోసం మేం బయల్దేరుతున్నామన్న ఆయన తిరుపతి, చెన్నై దగ్గర్లో ఉన్న వారు ఎవరైనా సాయం చేయండి. వెళ్లి రక్తాన్ని ఇవ్వండి. మీకు మిగతా సమాచారాన్ని చెబుతానని చెబుతూ ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఇక యష్ మాస్టర్ మాత్రమే కాక ప్రియమణి కూడా తన సోషల్ మీడియా వేదికగా బ్లడ్ కావాలని కోరారు. కేవల్ బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నాడని అతనికి మీ సపోర్ట్ కావాలంటూ ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా కోరారు.