Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
టైమింగ్ అదిరిపోయిందిగా.. ‘యాత్ర’ మూవీ టెలివిజన్ ప్రీమియర్ ఖరారు!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'యాత్ర' మూవీ టీవీ ప్రీమియర్ షోకు డేట్ ఫిక్స్ అయింది. ఈ ఆదివారం(ఏప్రిల్ 7) మధ్యాహ్నం 12 గంటలకు మా టీవీలో ఈ చిత్రం ప్రసారం కాబోతోంది. ఎన్నికల వేళ ఈ మూవీ ప్రసారం అవుతుండటంతో టైమింగ్ అదిరిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
యాత్ర టీవీలో ప్రదర్శితం అవ్వడం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి ఎంతో కొంత ప్లస్సవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మాటీవీ వారు ట్విట్టర్ ద్వారా ఈ విషయం ప్రకటించగానే సినిమా టీవీ ప్రీమియర్ వాయిదా వేయాలనే డిమాండ్ సైతం తెరపైకి వచ్చింది.
మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'యాత్ర'లో వైఎస్ఆర్ పాత్రను ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి పోషించారు. ఆయనే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకోవడం గమనార్హం. మమ్ముట్టి.. వైఎస్ఆర్ పాత్రకు జీవం పోశారనే అభిప్రాయాలు ప్రేక్షకుల నుంచి వ్యక్తం అయ్యాయి.
#Yatra World Television Premiere..This Sunday at 12 PM on @StarMaa#YatraOnMaa pic.twitter.com/wOLIyda7Vx
— STAR MAA (@StarMaa) April 4, 2019
ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ చేసిన పాదయాత్రలోని ముఖ్య ఘట్టాలను పోకస్ చేస్తూ 'యాత్ర' చిత్రం తెరకెక్కించారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుని వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి పేదల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న విషయాన్ని ఈ సినిమా ద్వారా ప్రజలకు గుర్తు చేశారు.