Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బుల్లితెరపై ఆ స్టార్ క్రికెటర్ షో..
ఈ కార్యక్రమానికి 'జిందగీ అభీ బాకీ హై' (జీవితం ఇంకా చాలా ఉంది) అనే టైటిల్ను ఖరారు చేశారు. మూడు ఎపిసోడ్ల పాటు సాగే ఈ ప్రోగ్రామ్లో తను ప్రాణాంతక కేన్సర్ను ఎలా జయించాడో యువీ వివరిస్తాడు. ఈ కార్యక్రమం కలర్స్ చానెల్తోపాటు ఎంటీవీలోనూ ఒకేసారి ప్రసారమవుతుంది.
ఈ వివరాలను వెల్లడించేందుకు బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువీ మాట్లాడుతూ.. 'నా అనుభవాలు పంచుకునేందుకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కేన్సర్ ప్రాణాలను హరించేస్తుంది. నాకు ఈ వ్యాధి ఉందని నిర్దారించినపుడు త్వరగా కోలుకోవాలని చాలామంది ప్రార్థించారు. కేన్సర్కు చికిత్స తీసుకుంటున్నపుడు నేను ఎదుర్కొన్న అనుభవాలను ప్రజలతో పంచుకోవాలని అనుకున్నాను. ఇలాంటి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వారిలో ధైర్యం నింపాలని భావించా. వారికి నా విజయం స్ఫూర్తిగా నిలవాలి. వారి జీవితాలు మళ్లీ చిగురించాలి. అందుకే ఈ కార్యక్రమం చేస్తున్నాన'ని తెలిపాడు.