Don't Miss!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Sports RR vs DC: సహనం కోల్పోయిన రిషభ్ పంత్వీడియో
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ తెలుగు ట్రైలర్, ఆకట్టుకుంటున్న డైలాగ్స్
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' తెలుగు ట్రైలర్ విడుదలైంది. మన్మోహన్సింగ్ గురించి ఆయన మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' అనే వివాదాస్పద పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ చిత్రంలో మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్, సంజయ్ బారు పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్లో డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ''నాకైతే డాక్టర్ సింగ్ ఎలాంటి లోపం లేని భీష్ముడిలా కనిపిస్తారు. పాపం ఫ్యామిలీ డ్రామాకు బలైపోయారు. మహా భారతంలో రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి. కానీ ఇండియాలో ఒక్కటే.'' అంటూ అక్షయ్ ఖన్నా చెప్పిన డైలాగులతో ట్రైలర్ మొదలైంది.
''వంద కోట్ల జనాభా ఉన్న ఈ దేశాన్ని కొందరు మాత్రమే పరిపాలిస్తూ మన దేశ చరిత్ర రాస్తున్నారు. మరి నేను వాళ్ల కథ రాస్తున్నాను. పీఎం కోసం పని చేస్తున్నా... పార్టీ కోసం కాదు'' అంటూ సాగే డైలాగులు సంజయ్ బారు పాత్ర తీరును వెల్లడిస్తున్నాయి.
మన్మోహన్ సింగ్ అంతరంగిక కథకు సాక్ష్యంగా ఈ సినిమా ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఆయన ప్రధాన మంత్రిగా పని చేసిన సమయంలో 'అణు ఒప్పందం', 'కాశ్మీర్ సమస్య' లాంటి విషయాలపై తీసుకున్న నిర్ణయాలను ఈ సినిమాలో బాగా ఫోకస్ చేస్తారని తెలుస్తోంది.
''నాకు ఎలాంటి క్రెడిట్ అవసరం లేదు. నాకు నేను చేస్తున్న పనే అవసరం. నాకు నా దేశమే అన్నింటికంటే ముఖ్యం.'' అంటూ అనుపమ్ ఖేర్ చెప్పే డైలాగులు డాక్టర్ మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వాన్ని స్పష్టం చేస్తున్నాయి. ''ఇంకెంత అప్రతిష్టపాలు చేస్తుంది పార్టీ, మీరేం మాట్లాడరా?'' అంటూ సింగ్ కుటుంబం బాధపడే సన్నివేశాలు సైతం ఇందులో చూపించారు.
విజయ్ రత్నాకర్ దర్శకత్వం వహించిన మూవీలో సోనియా గాంధీ పాత్రలో సుసాన్నే బెర్నెట్, ప్రియాంక గాంధీ పాత్రలో అహనా కుమ్రా, రాహుల్ గాంధీ పాత్రలో అర్జున్ మాథుర్ నటించారు. సునీల్ బోహ్రా, దావల్ జయంతిలాల్ గడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2019 జనవరి 11న హిందీలో, 18న తెలుగులో ఈ మూవీ విడుదల కాబోతోంది.