Tap to Read ➤

అడివి శేష్.. మేజర్ ట్రైలర్ రివ్యూ

అడివి శేష్ హీరోగా నటిస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. జూన్ 3 న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ,మలయాళం, భాషల్లో విడుదల కాబోతుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. తెలుగు ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు.
హిందీ ట్రైలర్ ను సల్మాన్ ఖాన్, మలయాళం ట్రైలర్ ను పృథ్వీరాజ్ సుకుమారన్ లాంచ్ చేశారు.
సరిహద్దు దాటి పాక్ ఆక్రమిత ప్రదేశమైన కశ్మీర్‌లోకి ప్రవేశిస్తాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌.’అదీ మనదే కదా సార్’ అంటూ అతని ధైర్య సాహసాలను తెలియజేస్తూ ట్రైలర్ మొదలైంది.
ముంబై దాడుల్లో టెర్రరిస్ట్ లకి ఎదురుగా నిలిచి మరణించాడు.
అతని గొప్పతనాన్ని ప్రపంచాన్ని తెలియజేయడానికి ఈ మూవీని శేష్ టేకప్ చేసినట్టు స్పష్టమవుతుంది.
ఈ మూవీలో ఆ ఒక్క దాడుల నేపథ్యం మాత్రమే కాదు సందీప్ బాల్యం, అతని పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా చూపించనున్నారు.
శేష్ కు జోడీగా సాయి మంజ్రేకర్‌ నటించింది. వీళ్ళిద్దరి రొమాంటిక్ ట్రాక్ ఆకట్టుకునేలా ఉంది.