Tap to Read ➤

'సర్కారు వారి పాట' ఫస్ట్ రివ్యూ

మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాపై ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమాపై బాలీవుడ్ సినీ అనలిస్ట్ ఉమైర్ సంధు ట్విట్టర్‌లో తన రివ్యూ ఇచ్చాడు.
మహేష్ బాబు-కీర్తి సురేష్ జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట' సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమాలో మహేష్ నటన ఓ రేంజ్‌లో ఉందని... ఇప్పటివరకూ వచ్చిన మహేష్ సినిమాల్లో ఇది ది బెస్ట్ అని పేర్కొన్నాడు.
'సినిమాలో మహేష్ సింహంలా గర్జించాడు. షో అంతా మహేష్ బాబుదే. యాంగ్రీ నటనతో తెరపై మహేష్ కనిపించిన ప్రతీసారి... అతని కోపం తెరను కాల్చేసినట్లే ఉంది.
సినిమాకు ఫుల్ పవర్ మహేష్ బాబే అనడంలో సందేహం అక్కర్లేదు. ఇప్పటివరకూ మహేష్ చేసిన సినిమాల్లో... ఇదీ ది బెస్ట్ అని చెప్పొచ్చు.
మాస్ ప్రేక్షకులే టార్గెట్‌గా తీసిన ఈ సినిమా... బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం.' అని ఉమైర్ సంధు పేర్కొన్నాడు.
సర్కారు వారి పాటలో యాక్షన్, డ్రామా, కామెడీ, మహేష్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని ఉమైర్ సంధు పేర్కొన్నాడు.
సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ చాలా అందంగా కనిపించిందని.. ఆమె నటన ఆకట్టుకుంటుందని ఉమైర్ సంధు తెలిపాడు.