Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వరుణ్ తేజ్, వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాకు అరుదైన గౌరవం.. తెలుగు నుంచి ఈ ఒక్కటే
వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి సక్సెస్ సాధించిన F2 సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరగబోయే 50వ గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఏఫ్ఏఫ్ఐ) ప్రదర్శనకు ఈ సినిమా ఎంపిక కావడం విశేషం. తెలుగు సినిమాల్లోని ఈ ఒక్క సినిమాకే ఈ అవకాశం దక్కింది.
నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఏఫ్ఏఫ్ఐ) వేడుక జరగనుంది. ఈ వేడుకలో మొత్తం 76 దేశాలకు చెందిన 250 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఇందులో 26 ఫీచర్ ఫిలింస్ ఉండగా 15 నాన్ ఫీచర్ ఫిలింస్ ఉన్నాయి. అయితే ఈ 26 ఫీచర్ ఫిలింస్లో ఎంపికైన ఏకైక తెలుగు చిత్రంగా F2 తన పేరును లికించుకుంది.
అనిల్ రావిపూడి తెరకెక్కించిన F2 సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు పొందింది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ వేడుకకి పది వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ అరుదైన అవకాశం దక్కడం పట్ల చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
ప్రస్తుతం వెంకటేష్.. వెంకీమామ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కానుందని సమాచారం. మరోవైపు గద్దలకొండ గణేష్ రూపంలో వరుణ్ తేజ్ ఇటీవలే సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు.