Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వరుణ్ తేజ్, వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాకు అరుదైన గౌరవం.. తెలుగు నుంచి ఈ ఒక్కటే
వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి సక్సెస్ సాధించిన F2 సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరగబోయే 50వ గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఏఫ్ఏఫ్ఐ) ప్రదర్శనకు ఈ సినిమా ఎంపిక కావడం విశేషం. తెలుగు సినిమాల్లోని ఈ ఒక్క సినిమాకే ఈ అవకాశం దక్కింది.
నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఏఫ్ఏఫ్ఐ) వేడుక జరగనుంది. ఈ వేడుకలో మొత్తం 76 దేశాలకు చెందిన 250 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఇందులో 26 ఫీచర్ ఫిలింస్ ఉండగా 15 నాన్ ఫీచర్ ఫిలింస్ ఉన్నాయి. అయితే ఈ 26 ఫీచర్ ఫిలింస్లో ఎంపికైన ఏకైక తెలుగు చిత్రంగా F2 తన పేరును లికించుకుంది.
అనిల్ రావిపూడి తెరకెక్కించిన F2 సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు పొందింది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ వేడుకకి పది వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ అరుదైన అవకాశం దక్కడం పట్ల చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
ప్రస్తుతం వెంకటేష్.. వెంకీమామ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కానుందని సమాచారం. మరోవైపు గద్దలకొండ గణేష్ రూపంలో వరుణ్ తేజ్ ఇటీవలే సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు.