Don't Miss!
- News తారకరత్న భార్య బిగ్ ట్విస్ట్ ..ఆ పార్టీకే మద్దతంటూ ప్రకటన
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఆది సాయికుమార్, వేదిక జంటగా కొత్త సినిమా ప్రారంభం
ఆది సాయికుమార్, వేదిక హీరో హీరోయిన్లుగా కొత్త సినిమా ప్రారంభం అయింది. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తీక్ విఘ్నేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ సురవరం చిత్రాన్ని నిర్మించిన అరా సినిమాస్ పై.లి. బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.
గతంలో తెలుగులో విజయ దశమి, బాణం చిత్రాల్లో నటించిన వేదిక 2011లో చివరగా 'దగ్గరగా దూరంగా' అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో నటిస్తోంది. ప్రమకథా చిత్రంగా ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది.
మార్చి 25 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చిత్తూరు జిల్లాలోని తలకోనలో ప్రారంభం కానుంది. రోబో, 2.0 చిత్రాలకు అసోసియేట్ కెమెరామెన్గా పనిచేసిన గౌతమ్ జార్జ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సి.సత్య సంగీతం సమకూరుస్తున్నారు.
ఈ చిత్ర నిర్మాణంలో న్యూ ఏజ్ సినిమా, తిరు కుమరన్ ఎంటర్టైన్మెంట్స్ అసోసియేట్ అవుతున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.
దర్శకత్వం:
కార్తీక్
విఘ్నేశ్
నిర్మాత:
కావ్య
వేణుగోపాల్
నిర్మాణ
సంస్థలు:
ఎంవి
అరా
సినిమాస్
ప్రై.లి,
న్యూ
ఏజ్
సినిమా,
తిరు
కుమరన్
ఎంటర్టైన్మెంట్స్
మ్యూజిక్:
సి.సత్య
సినిమాటోగ్రఫీ:
గౌతమ్
జార్జ్