Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఐశ్వర్యరాయ్, ఆరాధ్య ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్.. వాళ్ళు ఎక్కడున్నారంటే?
ఇండియాలో కరోనా వైరస్ రోజురోజుకి మరింత విస్తరిస్తోంది. సాదారణ జనాల నుంచి సెలబ్రెటీల వరకు వైరస్ ప్రతి ఒక్కరిని భయాన్ని కలిగిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా సినీ తారలు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి కూడా కరోనా రావడం షాక్ కి గురి చేస్తోంది. అయితే మొదటిసారి బచ్చన్ ఫ్యామిలీ ఒకరికొకరు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రెండు వారాల పాటు దూరంగా..
ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ అలాగే వారి ఏకైక కూతురు ఆరాధ్యకి కూడా కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ అని తెలిన విషయం తెలిసిందే. అమితాబ్ భార్య అలాగే మిగతా కుటుంబ సబ్యులకు కూడా పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్ అని వచ్చింది. అయినప్పటికీ వారిని క్వారంటైన్ లోనే ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో బచ్చన్ ఫ్యామిలీకి రెండు వారాల పాటు కలుసుకోవడానికి వీలు లేదు.
ఐశ్వర్య, ఆరాధ్య ఇంట్లోనే..
ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ అలాగే అభిషేక్ బచ్చన్ ముంబైలోని నానావతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఐశ్వర్యరాయ్, ఆరాధ్య మాత్రం హాస్పిటల్ కి తీసుకు రాలేదట. వారిని పూర్తిగా ఇంటికే పరిమితం చేసినట్లు అభిషేక్ బచ్చన్ వివరణ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా కూతురు, భార్య ఆరోగ్య పరిస్థితిపై మొదటిసారి అభిషేక్ బచ్చన్ స్పందించారు.
సెల్ఫ్ క్వారంటైన్..
అభిషేక్ వివరణ ఇస్తూ.. "ఐశ్వర్య, ఆరాధ్యలకు కోవిడ్-19 టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. అయితే వారు ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు. బృహత్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ వారి ఆరోగ్య పరిస్థితి గురించి మాకు వివరణ ఇచ్చారు. అవసరం అయినంత వరకు సహాయాన్ని అందిస్తున్నారు. ఇక మిగతా నా కుటుంబ సభ్యులతో పాటు మా అమ్మకు కరోనా వైరస్ పరీక్షల్లో నెగిటివ్ అని వచ్చింది" అంటూ అభిషేక్ తెలియజేశారు.
Recommended Video
బయపడవద్దంటూ..
ఆరోగ్య విషయంలో బచ్చన్ ఫ్యామిలీ ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. అలాంటిది వారిపై కరోనా వైరస్ దాడి చేయడంతో ఇప్పుడు దేశమంతా మరింత భయాన్ని కలిగిస్తోంది. అయితే ఈ విషయంలో ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దని ధైర్యంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా వైరస్ నుంచి బయటపడగలమని అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.