Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘ఆచార్య’తో కలిసి అలా కనిపించిన ‘సిద్ధ’: ఆకట్టుకుంటోన్న రామ్ చరణ్ నక్సలైట్ లుక్
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ తరహాలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే మెగా మల్టీస్టారర్ చిత్రం రూపొందుతోంది. అదే.. మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న 'ఆచార్య'. ఈ చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఆది నుంచి భారీ బజ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ మూవీ చిత్రీకరణ సాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నుంచి ఓ సర్ప్రైజ్ వచ్చేసింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న మెగా మల్టీస్టారర్ మూవీ 'ఆచార్య'లో రామ్ చరణ్ పాత్ర కీలకంగా ఉండబోతుంది. అతడు ఇందులో 'సిద్ధ' అనే నక్సలైట్ పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన హింట్ కూడా ఇచ్చేసింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాలోని రామ్ చరణ్ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈరోజు మెగా పవర్ స్టార్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని కొద్ది సేపటి క్రితమే చిత్ర యూనిట్ ఈ పోస్టర్ను విడుదల చేసింది. ఇందులో చిరంజీవి.. చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా కనిపిస్తున్నారు. ఇద్దరూ తుపాకులు పట్టుకుని వస్తున్నారు.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. దీనికి 'ఆచార్య'తో సిద్ధ అనే క్యాప్షన్ జోడించారు. ఆయన చేసిన పోస్టును రీట్వీట్ చేసిన రామ్ చరణ్.. 'మీ పక్కన నటించాలన్న కల ఇప్పటికి నెరవేరింది నాన్న' అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్టర్లో తండ్రీ కొడుకులు జంటగా దర్శనమివ్వడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి సరసన ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే, చరణ్కు జోడీగా పూజా హెగ్డే చేస్తోంది.